Connect with us

Movie News

వీళ్లను చూస్తే మీరు అస్సలు గుర్తుపట్టరు

Published

on

ఒకప్పుడు టాలీవుడ్ తెరమీద తళుక్కున మెరిసి … మాయమైన ఈ అందాల భామలు
ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

వాళ్లంతా ఒకప్పుడు టాలీవుడ్ లో తళుక్కున మెరిసిన అందాల తారలు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. అందం , అభినయం కలబోసిన ఆ ముద్దు మందారాలు .. చేసినవి అతి తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసారు. కెరీర్ లో మంచి హిట్స్ పడిన తరుణంలోనే ఏం జరిగిందో కానీ, సినీ జీవితానికి గుడ్ బై చెప్పేసి, వేరే రూట్లో పయనిస్తున్నారు. మరి వీళ్లంతా ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో అనే ఆతృత అందరికీ ఉండడం సహజం.

Advertisement

ముందు గా ఈ లిస్ట్ లో ఉన్న అందాల తార అపర్ణ. నైంటీస్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సుందర కాండ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దు గుమ్మ, ఈ సినిమా తర్వాత అక్కపెత్తనం చెల్లెలి కాపురం అనే ఒక్క సినిమా మాత్రమే చేసి తెలుగు తెరకు టాటా చెప్పేసింది. బెంగళూర్ కు చెందిన అపర్ణ ఈ సినిమా తర్వాత హిందీలో నాక్ అవుట్ అనే సినిమాలో మాత్రమే నటించి,2002 లోనే యు.ఎస్ శాన్ ఫ్రాన్సిస్కో లో సెటిల్ అయిపోయింది. చక్కటి భర్త, ముద్దులొలికే ఇద్దరు పిల్లలతో అపర్ణ అక్కడే హ్యాపీగా ఉంటున్నారు.

ఇక అతి తక్కువ సినిమాలతో ఇండియన్ స్ర్కీన్ మీద కనిపించి మాయమైన మరో అందాల హీరోయిన్ గిరిజ. తండ్రి కర్ణాటకకు చెందిన వైద్యుడు, తల్లి ఇంగ్లాండుకు చెందిన వ్యాపారవనిత. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన ఈమె 18 యేళ్ల వయసులో దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడానికి భారతదేశానికి వచ్చింది. భారతదేశముపై మమకారముతో హిందూ తత్త్వము మరియు మతముపై విస్తృతముగా పరిశోధన చేసింది. 1998లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి భారతీయ మతాలపై ఎం.ఏ కోర్సు పూర్తిచేసి, అరబిందో తత్త్వముపై డాక్టరేటు పరిశోధన చేసింది.

1989లో మణిరత్నం గీతాంజలితో సౌత్ స్ర్కీన్ మీద మెరిసింది. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో ఆమె ఆ తర్వాత కాలంలో పెద్ద హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు అందరూ. కానీ ఆమె వందనం అనే ఒక మలయాళ సినిమాలోనూ, హృదయాంజలి అనే మరో తెలుగు సినిమాలో మాత్రమే నటించగలిగింది. గిరిజ ప్రస్తుతం రచయితగా లండన్లో స్థిరపడింది. ఈమె నటనపై ఇప్పటికీ తన అధ్యయనము కొనసాగిస్తూ ఇతర నటులు మరియు సినీ నిర్మాతలతో పనిచేస్తూనే ఉంది. 2005 నుండి లండన్ లో ఆరోగ్య సంబంధ విషయాల విలేఖరిగా పనిచేస్తున్నది. ప్రస్తుతం గిరిజ అక్కడే ఉంటోంది.

Advertisement

తెలుగు తెరమీద అతి తక్కువ సినిమాల్లో నటించిన మరో అందాల తార మీనాక్షి శేషాద్రి. పెయింటర్ బాబు అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన మీనాక్షి.. అతి తక్కువ టైమ్ లోనే నెం. 1 హీరోయిన్ అయింది. బాలీవుడ్ బడా హీరోల సరసన నటించి, మెప్పించిన మీనాక్షి కి తెలుగు లో బాగా క్రేజీ తెచ్చిపెట్టిన చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటైమ్ లో తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి మేనకగా అదరగొట్టేసింది.అంతకన్నా ముందు జీవనపోరాటం సినిమాలో కేమియో రోల్ పోషించింది. ఆ తర్వాత విశ్వనాథ్ , చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆపద్బాంధవుడు లో మెరిసింది. 1998 వరుకూ మీనాక్షి బాలీవుడ్ తెరమీద లెక్కకు మించిన చిత్రాల్లో నటించి, చాలా ఏళ్లకు మళ్లీ 2016 లో సన్నిడియోల్ తో ఘాయల్ వన్స్ ఎగైన్ లో గెస్ట్ పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మీనాక్షి శేషాద్రి, యూ.ఎస్. లో సెటిలైంది. అక్కడ చెరిష్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ అనే డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తోంది. భర్త హరీష్, కేంద్ర, జోష్ , మ్యాట్ ఆమె పిల్లలు.

భద్రాచలం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి సింధు మీనన్ కూడా ఇప్పుడు సినిమాలు వదిలేసి దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టేసింది. రష్మి అనే కన్నడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన సింధు మీనన్ ఆ తర్వాత లెక్కకు మించిన సినిమాలతో సౌత్ స్ర్కీన్ మీద మంచి పేరు తెచ్చుకుంది. త్రినేత్రం, శ్రీరామచంద్రలు, ఆడంతే అదో టైపు, ఇన్స్ పెక్టర్ అనే సినిమాలు చేసినా కృష్ణవంశీ చందమామ అమ్మడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 2010 ఏప్రిల్ లో డామ్నిక్ ప్రభు అనే ఒక వ్యాపార వేత్తను పెళ్లిచేసుకొని యూ.ఎస్ లో సెటిల్ అయింది. ఆమెకు స్వెట్లానా అనే ఒక అమ్మాయి. సింధు మీనన్ ఆఖరి తెలుగు సినిమా సుభద్ర. సో.. అలా ఈ నలుగురు అందగత్తెలు .. మెరుపు తీగల్లా మెరిసి టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!