టాలీవుడ్ లో రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ఎందరో దిగ్గజ నటీనటులను తీర్చిదిద్దిన సుప్రసిద్ద దర్శకులు, నటులు, దేవదాస్ కనకాల తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు రాజీవ్ కనకాల. రాజీవ్ సినిమాలలో నటించడానికి ముందు టి.వి.సీరియళ్ళలో నటించారు. ఈయన భార్య సుమ కనకాల ప్రముఖ టి.వి. యాంకర్, నటి. ఐతే మొదట్లో చిన్న చిన్న పత్రాలు చేసిన ఆయన.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేయడం మొదలు పెట్టారు. అలాగే ప్రతినాయకుడి పాత్రలోనూ అయన తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
ఒకట్రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. 1991లో వచ్చిన బాయ్ ఫ్రెండ్ చిత్రంద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకతవంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “స్టూడెంట్ నెం.1” చిత్రంలో అద్భుతమైన పాత్రలో నటిచించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తరువాత వరుసగా నువ్వే నువ్వే, అది, విష్ణు, సై , అతడు, అతిధి, ఆ ఫిలిం బై అరవింద్, లక్ష్మి, విక్రమార్కుడు, యమదొంగ, నాన్నకు ప్రేమతో, మహర్షి, అప్పట్లో ఒకడుండేవాడు మొన్న లేటెస్టుగా సంక్రాతి బరిలో దిగిన ఎంత మంచివాడవురా అనే చిత్రం లో నటించాడు రాజీవ్ కనకాల. అయితే రాజీవ్ కనకాల, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ నటించిన దాదాపు అన్ని చిత్రాలలో రాజీవ్ కనకాల ఎదో ఒక పాత్రలో నటిస్తుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో ప్రముఖ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటించాడు.
ఈ సినిమాతో ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. అయితే ఈ సినిమా తరువాత రాజీవ్ కనకాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆపై వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒకానొక సమయంలో చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. అయితే ఏమయిందో తెలియదు కానీ క్రమంగా బుల్లితెర మీద కనిపించడం తగ్గించేసారు రాజీవ్ కనకాల. కానీ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాల్లో మాత్రం కీలకపాత్రలు పోషించాడు. ఇక స్టూడెంట్ నెం.1 సినిమా తరువాత నుంచి ఎన్టీఆర్, రాజీవ్ కనకల ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సంబంధించిన పలు వ్యాపారాలు సైతం రాజీవ్ కనకాల చూసుకుంటాడని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటారు. అయితే ఆ బిజినెస్ లు ఏంటనేవి మాత్రం బయటికి తెలియదు. ఎన్టీఆర్ కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటూ మరికొన్ని వ్యాపార లావాదేవీలను రాజీవ్ కనకాల దగ్గరుండి చూసుకుంటాడని అంటారు. ఒక వైపు బిజినెస్ చూసుకుంటూనే మరో వైపు సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు రాజీవ్ కనకాల. తాజగా విక్టరీ వెంకటేష్, ప్రియమణి హీరో హీరోయిన్లుగా వస్తున్నా నారప్ప సినిమాలో హీరోయిన్ ప్రియమణికి అన్నగా రాజీవ్ కనకాల నటిస్తున్నాడని సమాచారం.
Pitapuram: దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏకంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ నాల్గవ తేదీ వెలవడే ఫలితాల కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై రాజకీయ నాయకులు అటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ దిగగా ఈయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీత గెలిస్తే తనుకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తానని చెప్పారు దీంతో ఈమె గెలుపు పై కూడా ఆసక్తి నెలకొంది.
Advertisement
ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత.. ఈ క్రమంలోనే వంగా గీత గెలుస్తారని గెలుస్తారు అంటూ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. అయితే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పై మాత్రమే కాకుండా పార్లమెంట్ అభ్యర్థిపై కూడా సుమారు 500 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
Laya: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లయ ఒకరు. ఈమె హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అయితే ఈమె నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం విశేషం ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా లయ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఇక పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుత తన కూతురితో కలసి సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు అదే విధంగా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం నటుడు నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Advertisement
రోడ్డుపై పడ్డాను.. తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను అయితే తాను అమెరికాలో ఉన్నాననే విషయం తెలియడంతో చాలామంది నాపై ట్రోల్స్ చేశారు. అమెరికాలో నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని అడుక్కు తింటూ రోడ్డుపై పడ్డానని చాలామంది విమర్శలు చేశారు . అయితే ప్రస్తుతం ఇలాంటి వాటి గురించి పట్టించుకోవడం లేదంటూ లయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై చాలా ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. అయితే ఈసారి జనసేన పార్టీ సింగిల్ గా కాకుండా తెలుగుదేశం అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ విషయంలో ఓ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి ఏ పదవి ఇస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కు ఆయనకు తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హోం శాఖ మంత్రి అయితే శత్రువుల పాలిట సింహ స్వప్నంలా మారతారని ఆయనకు అదే కరెక్ట్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
హోం శాఖ మంత్రి.. ఇలా పవన్ అభిమానులు చేసే ఈ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ స్పందిస్తూ ముందు పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలవనివ్వండి తర్వాత హోంశాఖ గురించి ఆలోచిస్తారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజక వర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి.