ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సంక్షేమ పధకాల అమలులో దూకుడు పెంచారు. అమ్మ ఒడి పధకం తరువాత మరి కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ప్రతి పేదవాడికి సొంతింటి కల నిరవేరుస్తానని ప్రజలకు మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిజం చేయనున్నారు.
ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ఆ స్థలాన్ని పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒకవేళ ప్రభుత్వ భూమి లేని పక్షంలో భూమిని కొనుగోలు చేయాలని కలెక్టర్లకు సూచించారు జగన్. ఈ ఇంటి స్థలాలకు ఇప్పటినుంచే పని మొదలు పెట్టాలని 2020 ఉగాది లోపు ఖచ్చితంగా పని పూర్తిచేయాలని సీఎం జగన్ అన్నారు. ఈమేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, కొందరు అధికారులు హాజరయ్యారు. గ్రామ వాలంటీర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రమామణికంగా తీసుకోవాలని అన్నారు. ఇళ్ల పట్టాలకోసం గుర్తించే స్థలాలు ప్రజలు ఆవాసయోగ్యంగా ఉండాలని మర్చిపోకూడదని అధికారులకు సీఎం సూచించారు. ప్రతిపేదవాడికి ఇళ్ల పట్టాలు అందాలని, అక్రమాలు జరిగితే అధికారులే భాద్యత వహించాలని హెచ్చరించారు.






























