దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా పేరొందిన నయనతార – విఘ్నేష్ శివన్ తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంను దర్శించుకున్నారు. గురువారం ఉదయం జరిగిన వీఐపీ విరామ సమయంలో ఈ స్టార్ జంట స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం చేసుకోవడం విశేషంగా మారింది. ప్రస్తుతం వీరి దర్శనానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ఆలయానికి చేరుకున్న వెంటనే దేవస్థానం అధికారులు ఈ జంటకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి, శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య వారు కొంతసేపు గడిపారు.
ఈ సందర్బంగా నయనతార సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. సాదాసీదా లుక్లోనూ ఆమె మెరుపు తగ్గలేదు. ఇక విఘ్నేష్ శివన్ పంచెకట్టులో దర్శనమివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి సాంప్రదాయ దుస్తులు భక్తుల దృష్టిని ఆకర్షించాయి.
స్టార్ జంటను చూసిన అభిమానులు వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు జాగ్రత్తలు తీసుకుని, నియంత్రణలోనే వారి దర్శనాన్ని పూర్తి చేయించారు. అభిమానులతో కలిసే అవకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ, వారి దర్శనం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.
ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తరచూ కనిపిస్తున్న నేపథ్యంలో, నయనతార – విఘ్నేష్ శివన్ జంట దర్శనం కూడా చర్చనీయాంశంగా మారింది. భక్తి, సినీ గ్లామర్ కలిసిన ఈ క్షణాలు సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతున్నాయి.



























