డబ్బులు కాజేయాలనే ఉద్దేశ్యంతో తన కుమారుడు అమ్రీష్పై అక్రమ కేసుల్లో ఇరికించారని అందువల్ల ఆ కేసులను మద్రాసు హైకోర్టు కొట్టివేసిందని సీనియర్ నటి జయచిత్ర తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సంగీత దర్శకునిగా రాణిస్తున్న తన కుమారుడిపై ఇరీడియం కేసులో ఇరికించి పెద్ద ఎత్తున డబ్బు కాజేయాలని కుట్ర పన్నారని తెలిపారు. అయితే ఇందులో తన కుమారుడు అమ్రీష్కు ఎటువంటి సంబంధం లేదని ఈ నెల 15వ తేదీన కోర్టు తీర్పిచ్చింది.

అదే విధంగా అమ్రీష్ పై పెట్టిన అన్ని కేసులనూ కొట్టివేసినట్లుగా బుధవారం తనకు కోర్టు నుండి పత్రాలు అందాయని ఆమె తెలిపారు. తన కుమారుడు అమ్రీష్ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఈ అక్రమ కేసుల్లో ఇరికించారని.. అది తల్లిగా తనను చాలా బాధ కలిగించిందని.. అయితే దైవానుగ్రహం వల్ల న్యాయమే గెలిచిందని ఆమె అన్నారు. ఇకపై అమ్రీష్కు వ్యవహారాలను తానె దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఈ సందర్బంగా తెలిపారు.
అలాగే తనపై ఉన్న అన్ని కేసులను కొట్టివేసినట్టుగా కోర్టు నుంచి నాకు బుధవారం పత్రాలు అందాయి. అమ్రీస్ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని అక్రమ కుసుల్లో ఇరికించడం తల్లిగా నాకు చాలా బాధ కలిగించింది. దైవానుగ్రహం వల్ల న్యాయమే గెలిచింది. ఇకపై అమ్రీష్కి అన్నీ తానై వ్యవహాలను పర్యవేక్షిస్తాను. కాగా.. జయచిత్ర హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు తోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించారు.































