దేశంలో కొన్ని ప్రాంతాలలో పిడుగు పాటు కారణం గా ప్రాణనష్టం సంభవిచింది. గత 24 గంటల్లో 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్వాన్ జిల్లాల్లో ఏర్పాడిన పిడుగు ప్రమాదంలో మహిళ సహా నలుగురు మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు.

బీహార్లోని బంకా ప్రాంతంలో పడిన పిడుగుపాటు కారణంగా ఏడుగురు మరణించారు. జార్ఖండ్లోని పలాము జిల్లాలో పిడుగు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఓ రైతు ఉన్నారు. ఇక ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పిడుగుపాటుతో ఐదుగురు తనువు చాలించారు.





























