దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో తాజాగా పిల్లలలో పెరుగుతున్న కేసులు కొంత ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు మెుదలయ్యాయి. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది పిల్లలకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వారు 136 మంది ఉన్నట్లు కర్ణాటక అధికారులు వెల్లడించారు.

థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిచ్చినట్లుగా పిల్లలకు కోవిడ్ సోకుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. దీంతో కర్ణాటక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పిల్లలను ఇళ్లల్లనే ఉంచాలని, బయటకు తీసుకురావొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. మునుముందు ఈ ప్రభావం మరికొంత పిల్లలపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
































