కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు పెద్దలు. అయితే ఇక్కడ ఓ కుర్రాడు తెలిసి చేశాడా.. తెలియక తప్పు చేశాడా అనేది తెలియదు కానీ.. చేసిన తప్పుకు భయంకరమైన శిక్ష విధించారు. ఇంతకు అతడు చేసిన తప్పేంటంటే.. 8 ఏళ్ల వయస్సు ఉన్న కుర్రాడు.. ఓ మదర్సా లైబ్రరీలో మూత్ర విసర్జన చేశాడు. దీంతో అతడిపై కేసు పెట్టారు. పోలీసు ప్రొటెక్టివ్ కస్టడికి పంపారు. అతడు హిందూ బాలుడు. ఇలా తెలియక చేసిన తప్పుతో ఇబ్బందుల్లో పడ్డాడు.

పాకిస్తాన్ ఇది పెద్ద నేరంగా పరిగణించారు. ఆ బాలుడు దైవ దూషణకు పాల్పిడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ లో దైవ దూషణకు పాల్పడినవారికి మరణ శిక్ష విధిస్తారు. ఇలా ఈ ఆరోపణలు ఎదుర్కొని కేసు పెట్టిన వారిలో ఈ బాలుడిదే అతి చిన్న వయస్సు. ఆ లైబ్రరీలో మత పరమైన పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. కానీ ఈ కుర్రాడు తనకు తెలిసే ఇలా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ ఆ బాలుడి తల్లిదండ్రులు మాత్రం అతడు కావాలని చేయలదని.. తన కుమారుడికి ఏ పాపం తెలియదని వేడుకున్నారు.
ఆ వయస్సులోని వారికెవరికైనా ఏం తెలుస్తుందని ఆ బాలుడి కుటుంబం అంటోంది. ఇటీవల పంజాబ్ ప్రావిన్స్ లోని రహీం యార్ ఖాన్ జిల్లాలో ఓ హిందూ ఆలయంపై ఓ గుంపు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బాలుడు కూడా ఆ ఆలయ సమీపంలోని నివసించే కుటుంబాల్లో ఒకడిగా గార్డియన్ పత్రిక పేర్కొంది. అప్పుడు గుంపు దాడిలో పాల్పడిన సుమారు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అయినా అక్కడ నివసిస్తున్న హిందూ కుటుంబాలు భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. భయంతో ఆ బాలుడి కుటుంబం కూడా ఎక్కడో అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళింది. తమకు ఇక్కడ రక్షణ కరువైందని.. అమాయకుడైన తన కుమారుడిని వాళ్లు ఏం చేస్తారో అని వాళ్లు ఆవేదన చెందుతున్నారు.































