Aata Srividya : ఈటీవీ లో వచ్చే పాపులపెట్టే సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయి ఆ తరువాత ఈటీవీ సీరియల్ సంఘర్షణలో ధరణి గా నటించిన శ్రీవిద్య అందరికి సుపరిచితురాలే. ఇక ఆట ప్రోగ్రామ్ తో మరింత పాపులర్ అయిన శ్రీ విద్య కెరీర్ బాగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ వక్కంతం వంశీని పెళ్లి చేసుకుని టీవీకి దూరమయ్యారు. చాలా రోజుల తరువాత మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న శ్రీ విద్య తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

తన పిల్లల కోసం కెరీర్ కి దూరం….
ఆట శ్రీవిద్య పలు టీవీ షోస్ చేస్తూ బాగా పాపులర్ అయిన సమయంలోనే ప్రేమించి పెద్ధలను ఒప్పించుకుని వక్కంతం వంశీ గారిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్ళైన వెంటనే ఒక బాబు పుట్టిన వెంటనే చనిపోవడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిన ఆ తరువాత పాప అర్ణవి పుట్టింది. ఇక ఆ తరువాత బాబు యువన్ పుట్టాక వాళ్లిద్దరి బాధ్యతల వల్ల టీవీ కి దూరమయ్యారు శ్రీవిద్య.

అయితే లాక్ డౌన్ సమయంలో మరో పాప పుట్టి మరణించడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిన శ్రీ విద్య ఆ తరువాత బాగా లావుగా తయారయ్యారు. ఇక సర్జరీ ద్వారా చిన్నగా మారిన శ్రీవిద్య తన పిల్లల వల్లే తాను డిప్రెషన్ నుండి బయటికి వచ్చానంటూ చెప్తున్నారు. తన కూతురు ఆర్ణవి తనతో స్నేహాతురాలిగా ఉంటుందని చాలా వరకు తన స్ట్రెస్ అన్ని పోడానికి కారణం అంటూ చెప్పింది. ఇక కొడుకు యువన్ బాగా నవ్విస్తాడు అంటూ ఇంటర్వ్యూ లో వారిద్దరి ముచ్చట్లను పంచుకున్నారు శ్రీ విద్య.




























