Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈయన హీరో విజయ్ త్రిష నటించిన లియో సినిమాలో కీలక పాత్రలో పోషించారు. అయితే ఈ సినిమా విషయంలో భాగంగా ఈయన త్రిష పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి తాను పలు సినిమాలలో హీరోయిన్లతో రేప్ సన్నివేశాలలో నటించాలని కానీ ఈ సినిమాలో త్రిషతో నటించే అవకాశం రాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా త్రిషతో తనకు ఈ అవకాశం మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది అంటూ అసభ్యకర పదజాలం ఉపయోగించారు. అయితే ఈ వ్యాఖ్యలపై త్రిషా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈమెకు మద్దతుగా కుష్బూ కూడా అండగా నిలిచారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇతర సెలబ్రిటీలు కూడా ఈ త్రిషకు మద్దతుగా నిలబడటమే కాకుండా మన్సూర్ అలీ ఖాన్ లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.
ఇకపోతే ఈయన చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా త్రిషకో క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్లు వచ్చాయి కానీ మన్సూర్ మాత్రం తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొందరు ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలను తప్పుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంటూ ఈయన తెలిపారు. అయినప్పటికీ ఈయన పట్ల చాలామంది విమర్శలు కురిపించగా బహిరంగంగా త్రిషకు క్షమాపణలు చెప్పారు.
పరువు నష్టం కేసు వేసిన మన్సూర్…
ఇకపోతే త్రిష విషయంలో తన పట్ల కామెంట్లు చేస్తూ తన పరువుకు భంగం కలిగించినటువంటి త్రిష కుష్బూ చిరంజీవి వంటి సెలబ్రిటీలపై ఈయన పరువు నష్టం కేసుతో పాటు వారు తనని మానసికంగా హింసించారని అలాగే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు ఈయన వెల్లడించారు. త్రిషకు క్షమాపణలు చెప్పడంతో ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందని అందరూ భావించారు. కానీ ఈయన మరోసారి సెలబ్రిటీలపై కేసు వేయడంతో ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.



























