Suman: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సుమన్ ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగానికి చాలా మంచి అనుబంధంగా ఉందని తెలిపారు. ఎంతో మంది సినీ సెలబ్రిటీలో రాజకీయాలలో ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు.

ఈ విధంగా సినిమా సెలబ్రిటీలు రాజకీయాలలోకి వెళ్లినప్పుడు వారిని రాజకీయంగా ప్రశ్నించాలి కానీ వ్యక్తిగతంగా ప్రశ్నలు వేయకూడదు అలాగే విమర్శలు చేయకూడదు కానీ ఇటీవల కాలంలో రాజకీయాలు అంటే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడమే రాజకీయంగా మారిపోయింది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టుగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ నుఇటీవల ఎంతో మంది వ్యక్తిగతంగా విమర్శలు చేశారు.
ఆయన ముగ్గురు పెళ్ళాలని చేసుకున్నారంటూ విమర్శించారు ఆయన ముగ్గురిని చేసుకుంటే మీకేంటి 30 మందిని చేసుకుంటే మీకేంటి వాళ్ళు వచ్చి మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? లేకపోతే ఏదైనా సాయం అడిగారా? ఇలా వ్యక్తిగత విమర్శలు తగవని ఈయన తెలిపారు అలాగే రోజా గురించి కూడా మాట్లాడారు.
ఎంతో కాంప్రమైజ్ కావాలి..
ఒక ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే ఎంతో కష్టపడాలి. ఎంతో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రోజా గురించి కూడా చాలామంది కాంట్రవర్సీ మాటలు మాట్లాడటం చాలా బాధ కలిగించిందని సుమన్ తెలిపారు. ఆవిడ బోల్డ్ గా మాట్లాడుతుంది. అందరిలా సైలెంట్ గా ఉండాలంటే ఎలా? మహిళలను గౌరవించాలి. అన్ని పార్టీల వారికి అదే వర్తిస్తుందని ఈ సందర్భంగా సుమంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























