సంచలన నటి పాయల్ ఘోష్ పై ముంబైలో యాసిడ్ దాడి జరిగినట్లు తెలుస్తుంది. మెడిసిన్ కోసం మెడికల్ స్టోర్ కి వెళ్ళిన ఈమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తనపై యాసిడ్ దాడి చేయటానికి ప్రయత్నించారని నటి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే గాయపడిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే ఈ విషయాన్ని బయటపెట్టారు.

గతంలో దర్శకుడు నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా పాపులారిటీ అయిన ఈ బ్యూటీ తాజాగా దుండగుల చేతిలో గాయపడినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.తను తన కారు డ్రైవర్ బైలోని ఒక మెడికల్ స్టోర్ కి వెళ్లి మందులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తుల ముసుగులో వచ్చి తనపై దాడి చేశారని తెలియజేసింది.
ఆ సమయంలో గట్టిగా అరవడం వల్ల దుండగులు తనని రాడ్ తో కొట్టి పారిపోయారని.. వారి చేతిలో ఒక సీసా ఉందని అది ఏంటి అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఒక వేళ అది యాసిడ్ కూడా అయి ఉండొచ్చని పాయల్ తెలియజేసింది. తన జీవితంలో ఎప్పుడూ ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకోలేదని ఇదే మొదటిసారి అని పాయల్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే తనపై జరిగిన దాడిని పోలీసులకు తెలియజేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బయలుదేరుతున్నాను అంటూ తన చేతికి గాయమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదిఏమైనప్పటికీ సినీనటి పై ఈ విధంగా దాడి జరగడం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పవచ్చు.
































