Taapsee:దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మందినాదం అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తాప్సి ఎంతో బిజీగా ఉన్నారు. ఇక కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇక నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయారు.

ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న తాప్సీ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాప్సీ గత కొద్ది రోజుల నుంచి బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఏడాదిలోనే పెళ్లి…
తాప్సీ తన సోదరి షగుణ్ పన్ను ద్వారా మాథియాస్ బో తాప్సీ కలుసుకోవడం జరిగింది. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.ఇక వీరిద్దరూ గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉండగా తాజాగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేది ఎప్పుడు అనే విషయం గురించి క్లారిటీ లేకపోయినా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.































