Adavi Shesh : ‘కర్మ’ సినిమాతో తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అడవి శేష్ మొదట పదిహేను ఏళ్ల వయసులో తొలిసారి సొంతం సినిమాలో నటించాడు. ఇక డైరెక్టర్ గానూ రైటర్ గానూ తన సినిమా కథలను తానే మలుచుకునే అడవి శేష్ గూడాచారి, క్షణం, మేజర్ వంటి చిత్రాలతో హిట్లని మాత్రమే కాకుండా అభిమానులను కూడా పెంచుకున్నాడు. ప్రస్తుతం హిట్ సినిమా సీక్వెల్ లో నటిస్తున్న అడవి శేష్ ఈ సినిమాను అన్ని భాషలలోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న అడవి శేష్ తాను మొదట చేసిన సినిమా సొంతం గురించి షాకింగ కామెంట్స్ చేసారు.

సొంతం సినిమా ఇప్పటికీ చూడలేదు… ఆ విషయంలో హర్ట్ అయ్యాను…
పుట్టింది హైదరాబాద్ లోనే అయినా అమెరికా లో పెరిగిన అడవి శేష్ మొదట తనకు పదిహేను ఏళ్ళు ఉన్నపుడు సినిమాలో నటించాడు. అదికూడా తెలుగు సినిమాలో కనిపించాడు. శీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ‘సొంతం’ సినిమా, ఆ సినిమాలో నమిత ను పెళ్లి చేసుకోడానికి వచ్చే ఫారిన్ పెళ్లి కొడుకుగా అడవి శేష్ ఒక సీన్ లో అలా కనిపిస్తాడు. అయితే సినిమాకు తీసుకున్నపుడు మాత్రం తనది వన్ ఆఫ్ ది హీరో రోల్ అని హిందీ సినిమా ‘దిల్ చాహతా హై’ లాంటి స్టోరీ అని చెప్పారట.

ముగ్గురు హీరోలు ఉంటారు అంటూ చెప్పి తీరా చూస్తే మూడు రోజుల్లో సీన్ షూట్ చేసి పంపారు. దాంతో బాగా హర్ట్ అయ్యాను, అందుకే ఇప్పటికీ ఆ సినిమా చూడలేదు అంటూ ఓపెన్ గా చెప్పేసాడు. అయినా శీను వైట్ల ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ ఇప్పుడు కాదు కాబట్టి ఓపెన్ గా చెప్పాడు కానీ అదే ఇప్పుడు కూడా మంచి స్టేజిలో శీను వైట్ల ఉండి ఉంటే ఇలానే చెప్పేవాడా అంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు.































