Aditi Rao: అదితీ రావు హైదరి పరిచయం అవసరం లేని పేరు గత కొద్దిరోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతుంది. ఇలా ఈమె సోషల్ మీడియా వార్తల్లో నిలవడానికి గల కారణం నటుడు సిద్ధార్థతో కలిసి ఈమె సహజీవనం చేయడమే.దాదాపు 8 సంవత్సరాల తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు నటుడు సిద్ధార్థ్.
మహాసముద్రం సినిమా ద్వారా నటుడు శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరు ఈ సినిమాలో నటించారు.

ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ కి జోడిగా అదితి నటించారు. ఇలా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరు ఇదే రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఏకంగా సహజీవనం చేస్తూ తమ మధ్య ఉన్న రిలేషన్ ను బహిరంగంగా బయటకు చెప్పారు. తమకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనీ వెల్లడించారు. అయితే వివాహం జరిగి వీరి జీవిత భాగస్వామిలతో విడాకులు కూడా అయ్యాయి.
ఈ క్రమంలోనే నటి అదితి రావు మాజీ భర్త సత్యదీప్ మిశ్రా ఇటీవలే నీనా గుప్తా-వివియన్ రిచర్డ్స్ కుమార్తె మసాబా గుప్తానురెండవ వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం ఇలా వీరిద్దరూ జనవరి 27వ తేదీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అనంతరం తమ బంధువులు సన్నిహితులకు చిన్న పార్టీ అరేంజ్ చేశారు.

Aditi Rao: ధైర్యంతో ముందడుగు వేయాలి…
ఈ క్రమంలోనే సత్య దీప మిశ్రా తన మాజీ భార్య అతిథి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా బంధం గురించి దాచాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. రహస్యాలు అనేవి బంధాన్ని చాలా ప్రభావితం చేస్తాయని తెలిపారు. అదితి రావుతో నా రిలేషన్ కారణంగా నాకు ప్రేమ పైనే విరక్తి కలిగిందని మరోసారి ప్రేమలో పడటం అంటే భయం వేసిందని తెలిపారు. అయితే ఇలా బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు ధైర్యంతో ముందడుగు వేస్తేనే కోల్పోయినది తిరిగి పొందుతామని వెల్లడించారు.































