తెలుగు సిని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు రోజా గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి సూపర్ స్టార్ హీరోయిన్ లలో రోజా కూడా ఒకరు.మొదటి సారిగా ప్రేమ తపస్సు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. టాలీవుడ్ హీరో బాలకృష్ణతో కలిసి నటించిన భైరవ ద్వీపం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలతో అలరించింది రోజానే.అయితే రోజా ఒకవైపు రాజకీయ నాయకురాలిగా సేవలు అందిస్తూనే మరోవైపు టీవీ షోలలో కనిపిస్తుంటారు రోజా. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
ఈమె కేవలం తెలుగు భాషలోనే కాకుండా, తమిళంలోనూ చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. రోజా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మొదట రాజకీయాల్లో టిడిపి పార్టీలో చేరి ఆ తర్వాత వైసీపీలో చేరింది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఒకవైపు రాజకీయాల్లో, మరోవైపు ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది.
రోజా కూతురు అన్షు మాలిక కూడా తల్లి బాటలోనే పయనిస్తోంది. చిన్న వయసులోనే మంచి మంచి అవార్డులు సాధించింది. ఇటీవలే రోజా తన కూతురు అన్షు గురించి మాట్లాడుతూ.. తన కూతురు ఒక ప్రముఖ ఎన్జీవో ఆర్గనైజేషన్ ద్వారా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తోంది అని తెలిపింది. ఇంత చిన్న వయసులోనే తన కూతురికి అలాంటి ఆలోచన వచ్చినందుకు తనకు చాలా గర్వంగా ఉందని తెలిపింది. తన కూతురికి చదువు అంటే చాలా ఇష్టమని ఎప్పుడూ చదువు పుస్తకాలను చదువుతూనే ఉంటుంది అని తెలిపింది.
































