Adusumilli Srinivasa Rao : జబర్దస్త్ మీద, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద తీవ్ర ఆరోపణలు చేసిన కిర్రాక్ ఆర్పి మీద చాలా మంది విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసం, ఇలా దిగజారిపోయాడు అంటూ వాఖ్యనిస్తున్నారు. అయితే తాజాగా సినిమా సీనియర్ విమర్శకుడు అడుసుమల్లి శ్రీనివాస రావు ఈ ఇష్యూ మీద మాట్లాడారు. కిర్రాక్ ఆర్పి కామెంట్స్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆ కుక్కను చెప్పుతో కొట్టాలి…
జబర్దస్త్ ద్వారా పైకి వచ్చి ఇపుడు వేరే చోట అవకాశాలు రాగానే జబర్దస్త్ ను విమర్శిస్తున్న ఆర్పి ని తీవ్రంగా తప్పుబట్టాడు. జబర్దస్త్ కి ముందు రోడ్డు మీద ఉన్న నిన్ను ఈ స్టేజి కి తెచ్చిన జబర్దస్త్ ను విమర్శిస్తావా అంటూ అన్నారు. మల్లెమాల సంస్థ, ఎమ్ఎస్ రెడ్డి గారు ఎలాంటి వారో అందరికీ తెలుసు. అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎలాంటి వారో అందరికీ తెలుసు. అంజి సినిమా ప్లాప్ అయిన తరువాత ఆయన ఎంత ఆర్థికంగా నష్టపోయారో ఎవరికీ తెలియదు, ఆయన మీడియా ముందుకు ఏ నాడు రాలేదు.

ఇక జబర్దస్త్ వాళ్ళ ప్రతిభ వల్ల శ్యామ్ గారు బాగా సంపాదిస్తూ సినిమాలనే వదులుకున్నారంటూ పిచ్చి వాగుడు వాగుతున్నాడు అంటూ మండి పడ్డాడు. జబర్దస్త్ కి అవకాశాల కోసం వచ్చి ఇపుడు ఆ సంస్థ మీదే నిందలు వేస్తున్నావ్, అవసరం తీరాక అన్నం పెట్టిన సంస్థను నిందిస్తున్న నీలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి అంటూ తీవ్రంగా మాట్లాడారు. కొన్ని డబ్బులు సంపాదిస్తేనే పొగరు నెత్తికెక్కింది అంటూ కామెంట్స్ చేసారు.


































