Advocate UdhayKanth : నరేష్ పవిత్ర లోకేష్ ఎపిసోడ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో నరేష్ కృష్ణ గారు మరణించాక పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అది సినిమా ప్రమోషన్లో భాగం అంటూ ఓవైపు కథనాలు వినిపిస్తున్నా నిజానిజాలు ఇంకా తెలియాలి. మరో వైపు తన మూడో భార్యకు నరేష్ విడాకులు ఇచ్చేసాడని, తాను డబ్బు తీసుకుని సెటిల్ చేసుకుందనే మాటలు వినిపించాయి. దీంతో ఈ విషయాలన్నింటి మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి రమ్య రఘుపతి తెలుగు యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడారు. ఇంటి నుండి వెళ్లగొట్టడానికి కృష్ణ గారి పేరు మీద పిటిషనర్ గా కృష్ణ గారిని మరో ఇద్దరిని పేర్కొని ఒక నోటీసు పంపారు. అందులో కృష్ణ గారితో కో హాబిటేంట్ అంటూ పేర్కొన్నారు. కృష్ణ గారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టి ఆయన నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు అన్నట్లుగా ఆయన సంతకం ఫోర్జెరీ చేసి నోటీసులు పంపారు అంటూ రమ్య రఘుపతి ఆరోపించారు. అసలు ఈ ఆరోపణల్లో నిజమెంత అనే విషయం మీద అడ్వకేట్ ఉదయ్ కాంత్ మాట్లాడారు.

కృష్ణ గారితో సంబంధం అని ఆరోపణల్లో వాస్తవం లేదు…
అడ్వకేట్ ఉదయ్ కాంత్ గారు మాట్లాడుతూ రమ్య రఘుపతి గారిని ఇంట్లో నుండి పంపేయడానికి ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేయగా అందులో నరేష్, ఆయన మేన మామ, అలానే కృష్ణ గారి పేర్లను ముగ్గురు పిటిషనర్లుగా పేర్కొన్నారు. అయితే అందులో అడ్వకేట్ చేసిన తప్పు పిటిషనర్ పేరు తెలుపకుండా కొ హాబిటేంట్ అంటూ పేర్కొనడంతో రమ్య కృష్ణ గారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టారు అంటూ ఆరోపిస్తున్నారు. నిజానికి పిటిషన్ నోటీసు సరిగ్గా చదువుకుంటే ఆమెకు అర్థమవుతుంది అందులో ఉన్నది అది కాదు అని, కానీ ఆవిడ ఆరోపణలను చేయాలనుకున్నారు అందుకే అలా చెప్పుకుంటున్నారు.

అనవసరంగా ఇందులోకి మరణించిన కృష్ణ గారిని లాగడం ఏం బాగోలేదు అంటూ చెప్పారు. నన్ను అనవసర ఆరోపణలతో ఇంటి నుండి బయటికి పంపుతున్నారు అని చెప్పుంటే కృష్ణ గారి సంతకం ఫోర్జెరీ చేసారు అని కేవలం చెప్పుంటే రమ్య వాదన బలంగా ఉండేది, కేసు పోయేది ఫోర్జెరీ అన్నది నిరూపిస్తే కానీ ఇలా అక్రమ సంబంధం అంటగట్టారు అంటూ ఆరోపించి అనవసర వివాదలకు తావిచ్చారు అంటూ అభిప్రాయపడ్డారు ఉదయ్ కాంత్.































