Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అల్లుఅరవింద్ తప్పకుండా అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ ప్రస్తుతం ఈ స్థాయిలో నిలబడ్డారు. ఇదిలా ఉండగా అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది.

ఇలా ఉన్నఫలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా బన్నీ క్రేజ్ పెరగడంతో బన్నీ తెలుగులో నటించిన సినిమాలు హిందీలో విడుదల కాబోతున్నాయి.ఈ క్రమంలోనే పుష్ప సినిమాని హిందీలో విడుదల చేసిన గోల్డ్ మైన్స్ సంస్థ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా హిందీలో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమయ్యింది.

ఈ క్రమంలోనే అలా వైకుంఠపురం సినిమా నుంచి జనవరి 26 వ తేదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు అయితే ఉన్నఫలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అందుకు గల కారణం ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లు అరవింద్ అలా వైకుంఠపురం సినిమా హిందీలో రీమేక్ చేయడం వల్ల ఆయన రంగంలోకి దిగి హిందీ వర్షన్ సినిమా విడుదలను ఆపినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న అల్లుఅరవింద్…
రోహిత్ దావన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా ఈ చిత్రాన్ని హిందీలో షేహజాదా పేరుతో ఈ చిత్రాన్ని భూషణ్కుమార్, అమన్ గిల్ లతో కలిసి అరవింద్ హిందీ రీమేక్ నిర్మాణంలోనూ భాగస్వాములయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా హిందీలో డబ్ అవుతూ విడుదలైతే హిందీ రీమేక్ సినిమాకు భారీ నష్టాలు వస్తాయి. అందుకే రంగంలోకి దిగిన అల్లు అరవింద్ మనీష్ షాతో ఆయన చర్చలు జరిపి అలా వైకుంఠపురం సినిమా డబ్బింగ్ వెర్షన్ విడుదలను ఉపసంహరించుకోవాలని చెప్పడంతో మనీష్ షా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అల్లు అరవింద్ తన బ్యానర్ జండా పాత బోతున్నారని తెలుస్తోంది.































