Alekhya: నందమూరి తారకరత్న ఉన్నఫలంగా గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే .ఇలా నందమూరి తారకరత్న మరణించడంతో ఆయన భార్య పిల్లలు ఇప్పటికీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తరచూ తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.

ఇక తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆయన కుటుంబం ఈ పెళ్లిని అంగీకరించలేదు. ఇలా పెళ్లి తర్వాత తారకరత్న తన భార్య పిల్లలతో కలిసి నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన మరణించిన అలేఖ్య రెడ్డిని నందమూరి ఫ్యామిలీ చేర తీస్తుందని అందరూ భావించిన అది మాత్రం జరగలేదు. ఇక తారకరత్న అంతిమయాత్రలో కూడా తన తండ్రి మోహన్ కృష్ణ అంటి ముట్టనట్టే ఉన్నారు.
ఇక ఇదే విషయం గురించి సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ అలేఖ్యను ప్రశ్నించారు. ఇప్పటికైనా మీకు నందమూరి ఫ్యామిలీతో కలిసిపోతారని నమ్మకం ఉందా అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అలేఖ్యరెడ్డి సమాధానం చెబుతూ.. ఆశ , నమ్మకం అనేది మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుంది.
ఏదో ఒక రోజు జరుగుతుంది..
ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లు ముందుకు సాగుతూ వచ్చాం.. తారకరత్న గారు ఎప్పుడూ ఆశ, నమ్మకాన్ని వదిలిపెట్టలేదు.. నేను కూడా వదిలిపెట్టను.. కచ్చితంగా ఏదో ఒక రోజు అది జరుగుతుంది.. నాకు నమ్మకం ఉంది.. పిల్లలకి ఓ ఫ్యామిలీ అంటూ ఉంటుంది.. అని ఈమె ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా నందమూరి ఫ్యామిలీ అలేఖ్య రెడ్డిని కోడలిగా అంగీకరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



























