Amma Rajashekhar : నటులు డైరెక్టర్లు గా మారడం, డైరెక్టర్లు సినిమాల్లో నటించడం ఇవన్నీ మామూలే. ఇక డాన్స్ మాస్టర్లు డైరెక్షన్లోకి రావడం కూడా చూసాము. ప్రభూ దేవా, రాఘవ లారెన్స్ అలా డాన్స్ మాస్టర్లుగా ఉంటూ దర్శకులుగా మారిన వాళ్ళే. ఇక ఆకోవలోకి వస్తాడు అమ్మ రాజశేఖర్. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు ఉన్న అమ్మ రాజశేఖర్ డైరెక్టర్ గా మారాడు. తమిళంలో సినిమా ప్రయత్నాలు చేసి ఇక తెలుగులోనూ సక్సెస్ అయ్యాడు అమ్మ రాజశేఖర్.

గోపీచంద్ అలా చేస్తాడని అనుకోలేదు…
తెలుగులో గోపీచంద్ హీరోగా ‘రణం’ సినిమాను దర్శకత్వం వహించారు అమ్మ రాజశేఖర్. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఆ తరువాత రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో ఖతర్నాక్ సినిమా తీశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ తానై ఎడిటింగ్ చేసాడు నా ప్రమేయం లేకుండా, ఇక కో ఆర్డినేటర్ నన్ను మోసం చేసారు అంటూ ఆరోపించాడు. సినిమా ఎడిటింగ్ సరిగా చేయకుండా ట్రిమ్ సరిగా చేయకుండా ఫస్ట్ కాపీ ఇచ్చేసారు. నేను ట్రిమ్ చేసుకుంటా అన్నా కూడా వినలేదు.

ఆ రోజు ప్రసాద్ ల్యాబ్ లో ఏడ్చాను అంటూ చెప్పాడు. ఇక రణం సినిమా సమయంలో గోపీచంద్ కు ఒక తండ్రి కొడుకుల కథ చెప్పాను. కొన్ని రోజుల తరువాత చూస్తే శంఖం సినిమా పేరుతో గోపీచంద్, సత్యరాజ్ కాంబినేషన్ లో తండ్రి కొడుకులుగా సినిమా వచ్చింది. పోస్టర్ చూసి చాలా షాక్ అయ్యాను. గోపీచంద్ కి కథ చెబితే ఇలా చేసాడేమిటి అని బాధేసింది. కథ బాగుంది మనం చేద్దాం అని చెప్పిన గోపీచంద్ వేరే వాళ్లతో ఇలా సినిమా చేయడంతో బాధేసింది. అడుగుంటే నేనే చేసేవాడిని కదా అంటూ చెప్పారు. ఇండస్ట్రీ లో చాలా మంది నన్ను మోసం చేసారు అంటూ చెప్పాడు అమ్మ రాజశేఖర్.































