Wooden Chair: కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా కొందరికి అదృష్టం తలుపు తడుతుంది.ఇలా అదృష్టం తలుపు తట్టినప్పుడు వృధాగా పడేసిన వస్తువులకు కూడా అధిక డిమాండ్ పెరుగుతుందని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఒక పాత కుర్చీ విషయంలో కూడా ఇలాగే జరిగింది.

ఒక పాత సామాన్ల దుకాణంలో వేస్ట్ గా పడి ఉన్న ఒక కుర్చీని చూసి మంత్ర ముద్దురాలైనా ఓ మహిళ అతనికి 500 రూపాయలు ఇచ్చి ఆ కుర్చీని సొంతం చేసుకుంది. అయితే ఆ కుర్చీ ప్రాముఖ్యత ఏమిటో ఆ మహిళకు కూడా తెలియదు. ఒకరోజు ఒక వ్యక్తిని కలిసిన ఆమె ఆ కుర్చీ విలువ ఎంత ఉంటుందో చెప్పమని అడగగా ఆ వ్యక్తి ఆ కుర్చీని పరిశీలించి ఎంతో ఆశ్చర్యపోయాడు.
ఈ క్రమంలోనే ఆ వ్యక్తి అది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్న అవాంట్ గార్డ్ ఆర్ట్ స్కూల్కు చెందినదని ఈ కుర్చీ ఎక్కువ మొత్తానికి అమ్ముడు పోతుందని తెలిపారు.1902లో ప్రముఖ చిత్రకారుడు కోలోమన్ మోసెర్ రూపొందించినట్టు తెలిపారు. దీంతో ఆ మహిళఈ కుర్చీని వేలానికి పెట్టింది ఆ మహిళ.
కేవలం ఫోటో చూసి 16 లక్షలు చెల్లించిన వ్యక్తి..
ఈ కుర్చీని వేలంలో పెట్టగా ఆస్ట్రియాకు చెందిన ఒక డీలర్ దీన్ని రూ.16 లక్షలకు కొనుగోలు చేశాడు. కనీసం కుర్చీని నేరుగా చూడకుండా కేవలం సెల్ ఫోన్ లో ఫోటో చూసి ఏకంగా 16 లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ కుర్చీ బ్రిటన్ కి ఎలా వెళ్ళింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఈ కుర్చీ ఇంత ధర పలకడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.
































