Analyst Damu Balaji : ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న ఎన్టీఆర్ గారి కుమార్తె పురందేశ్వరి చొరవతో ఆర్బిఐ 100 రూపాయల నాణెం ను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము గారు నాణెంను విడుదల చేయగా ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అయితే భార్యగా తాను పాల్గొనవలసిన హక్కు తనకు ఉందంటూ లక్ష్మి పార్వతి ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాయగా అసలు నాణెం ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని అది ఒక ప్రైవేట్ కార్యక్రమం అనే విషయాలు బయటికి వస్తున్నాయి. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడారు.

ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం చెల్లని రూపాయి…
లక్ష్మీపార్వతి నాణెం విడుదల వేడుకలకు తనని పిలవలేదని ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు మీద విరుచుకు పడింది. చంద్రబాబు తనకి కావాల్సినపుడు నందమూరి కుటుంబాన్ని ఒకటి చేస్తాడంటూ విమర్శలను గుప్పించింది. అయితే నిజానికి వందరుపాయల నాణేం ను కేంద్ర ప్రభుత్వం ముద్రించలేదు. పురందేశ్వరి ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల సందర్బంగా కేంద్రం తో అనుమతి తీసుకుని ముద్రించారు.

నిజానికి ఆ నాణేం బయట చలామణి కాదు. కేవలం ఎన్టీఆర్ మీద అభిమానం తో ఎవరైనా డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు. ఇక కాయిన్ విడుదల కార్యక్రమం కూడ ప్రైవేట్ గా జరిగినదే. రాష్ట్రపతి భవన్ లో కేంద్ర మంత్రి జెపి నడ్డా పలువురు పాల్గొనడం వల్ల అందరూ ప్రభుత్వ కార్యక్రమం అనుకున్నారు కానీ అది ప్రైవేట్ గా నందమూరి కుటుంబ సభ్యులు నిర్వహించిన కార్యక్రమం అందుకే ఆ వేడుకలకు లక్ష్మి పార్వతిని పిలవలేదు అంటూ బాలాజీ తెలిపారు.

































