Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు పూటకో మలుపు తిరుగుతూనే డైలీ సీరియల్ లాగా సాగుతోంది. ఓవైపు ఎంపీ అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం ఉంది అంటూ సిబిఐ ఆయనను అరెస్టు చేయాలని భావిస్తుంటే మరోవైపు అవినాష్ రెడ్డికి ఆ కేసుతో సంబంధం లేదు అంటూ హై కోర్ట్ లో పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. తాజాగా నిన్న జరిగిన విచారణలో సిబిఐ తరుపున న్యాయవది అవినాష్ రెడ్డిని సిబిఐ కస్టడీ కోరుతూ వాదనలు వినిపించగా అసలు కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదంటూ అవినాష్ రెడ్డి తరుపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. ఇక హై కోర్ట్ ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సిబిఐ కి షాక్, అవినాష్ రెడ్డికి ఊరట…
వివేకానంద రెడ్డి కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అవినాష్ రెడ్డి కూడా హత్య విషయంలో ఉండగా అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది మాత్రం అవినాష్ రెడ్డికి వివేకానంద చనిపోయిన విషయం చెప్పింది వివేకానంద కూతురు అయిన సునీత రెడ్డి భర్త నర్రి రాజశేఖర్ రెడ్డి తమ్ముడే. ఆయన ఫోన్ చేసి చెప్పిన తరువాతే అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు అంటూ వాదించారు. సిబిఐ ఆయనను విచారించడం లేదని కేవలం కేసును ఒక కోణంలో మాత్రమే దర్యాప్తు చేస్తుందంటూ గట్టిగా ఆయన వాదన వినిపించారు.

ఇక హై కోర్ట్ అవినాష్ ను అరెస్టు చేసే విషయంలో 25 తేదీ వరకు చేయకూడదని సిబిఐ కు ఆదేశించగా అలాగే విచారణకు ఎపుడు పిలిచినా అవినాష్ హాజరు కావాలని తెలిపారు. ఇక కేసులో కీలకంగా ఉన్న భాస్కర్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి లను కూడా సిబిఐ కస్టడీ కి కోరగా కోర్ట్ ఈ నేల 24 వరకు సమయం ఇచ్చింది అంటూ బాలాజీ తెలిపారు. ఇక కేసులో సిబిఐ విచారణ కేవలం ఆవినాష్ రెడ్డి వైపు నుండి మాత్రమే జరుగుతోందని అన్ని కొనాలలోనూ సిబిఐ విచారణ జరపడం లేదంటూ అభిప్రాయపడ్డారు.


































