Connect with us

Featured

శుభవార్త చెప్పబోతున్న మోనిత…కార్తీక్ భుజంపై చేయి వేసి ఓదార్చిన వంటలక్క..?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిన ఆనందరావు కార్తీక్ ను చెడామడా తిట్టేశాడు

Published

on

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిన ఆనందరావు కార్తీక్ ను చెడామడా తిట్టేశాడు. నేడు ఎపిసోడ్ లో భాగంగా ఆనందరావు ఈ దారుణం చూడటానికేనా నా కోడలను బతికించావు అంటూ కార్తీక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటి రోజే నువ్వు మోనితని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నీ దవడ పగలగొట్టిన ఉండి ఉంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదు. నువ్వు నింద వేసిన ఏళ్ల తరబడి భరించింది… నీలో మార్పు ఆశించింది.. అంతే కానీ నీకు విడాకులు ఇచ్చి వెళ్లి పోవాలని అనుకోలేదు అంటూ ఆనందరావు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మోనిత గురించి ముందే హెచ్చరించాం.. కానీ స్నేహం అనే ముసుగులో మమ్మల్ని మోసం చేసి చివరికి పెళ్లి వరకు తీసుకు వచ్చావ్.మోనితను పెళ్లికి ఏ విధంగా ఓపించావు కొన్ని గంటల భర్తగా ఉంటాననా? లేక నీ బిడ్డలకు కొన్ని గంటలు తండ్రిగా ఉంటాననా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.దీపని పెళ్లి చేసుకుని తనను మోసం చేసినందుకు తను నిన్ను ఎన్ని ప్రశ్నించాలి.. ఎన్ని రకాలుగా నిలదీయాలి.దీపకు చేసిన అన్యాయానికి నువ్వు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిదేనంటూ కార్తీక్ ను కడిగి పడేసాడు.

ఈ విధంగా తండ్రి తిట్టడంతో కార్తీక్ ఆవేశంతో చేసిన పని కాదు, అలాగే నా బలహీనత వల్ల దిగజారి చేసిన తప్పు కాదు ఇది.. అయినా నాకు శిక్ష పడింది. ఏ రోజు ఎలాంటి పరిస్థితులలో కూడా ఒక్క మాట అనలేదు. కానీ మోనిత వల్ల నా పై మచ్చ పడింది అంటూ కార్తీక్ బాధపడతాడు. కేవలం మోనితను పెళ్లి చేసుకుంటానంటేనే ఇలా అసహ్యించుకుంటున్నారు అలాంటిది తను గర్భవతి అని తెలిస్తే ఆయన ఏమైపోతారో అంటూ కంగారు పడుతుండగా.. దీప కార్తీక్ భుజంపై చేయి వేసి నీ తప్పు లేదని నీ అంతరాత్మకు తెలిసినప్పుడు ప్రపంచం మొత్తం ఏమనుకున్నా పర్వాలేదు అంటూ కార్తీక్ ను ఓదారుస్తుంది.

Advertisement

ఇక దీప ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మోనిత ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ.. అంజి వ్యవహారం మీరే చూసుకోండి అని చెప్పగా అవతల నుంచి మీరేం కంగారు పడకండి అంటూ సమాధానం చెబుతారు. అయితే మీ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తానని మోనిత చెబుతుంది. ఈ విధంగా ఆ వ్యక్తి ఇచ్చిన భరోసాతో ఎంతో సంతోషంలో మునిగిపోయిన మోనిత తనను అనుమానంతో చూస్తున్న ప్రియమణితో త్వరలోనే నీకు శుభవార్త చెబుతా.. అంటూ ఆనందంలో తేలుతుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం మరొక ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుంది.

Advertisement

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!