Anchor Anasuya: చిత్ర పరిశ్రమలో యాంకర్ గా నటిగా, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి అందరికీ సుపరిచితమే.కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా తన కెరియర్ ప్రారంభించిన అనసూయ అనంతరం యాంకర్ గా మారిపోయారు. ఇలా పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసినటువంటి ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఇదే పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొనే అనసూయ కొన్నిసార్లు తను చేసే పోస్టుల వల్ల నేటిజన్ల నుంచి తీవ్రమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఇలా పలుమార్లు నేటిజన్లో ట్రోలింగ్ గురైన ఈమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారికి దీటుగా తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Anchor Anasuya: బాధాకరమైన పోస్ట్ షేర్ చేసిన అనసూయ…
ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక బాధాకరమైన పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోస్ట్ చేస్తూ నేను బాగా దెబ్బ తిన్నాను. నేను బాధపడినంతగా బహుశా ఎవరుబాధపడలేదేమో అంటూ ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేయడంతో అనసూయను ఇంతలా బాధ పెట్టినది ఎవరు అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
































