Anchor Anasuya: యాంకర్ అనసూయ గత వారంలో ఈమెను పెద్ద ఎత్తున నేటిజన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది తనని ఆంటీ అంటూ ట్వీట్ చేయడంతో తనని ఏజ్ షేమింగ్ కిగురి చేస్తున్నారంటూ ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం మనకు తెలిసింది.

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన తర్వాత అనసూయ ఈ కేసు విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నేటిజన్స్ మరోసారి అనసూయను గెలికారు. ఇంతకీ అనసూయ కేసు పెట్టడంతో పోలీసులు ఏమన్నారు అంటూ నేటిజన్స్ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోని ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ నీలా మాకు పని పాట లేదు అనుకున్నావా అని పోలీసులు అనసూయకు చెప్పి పంపించి ఉంటారు అంటూ కామెంట్ చేశారు.
ఈ కామెంట్ పై స్పందించిన అనసూయలేదండి మీలా పని పాట లేని వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది అని చెప్పి పంపించారు అంటూ కామెంట్ చేశారు.
మీరు ఎంత తొందరగా నోరు జారుతారు అంతే తొందరగా బోల్తా పడతారు కొద్ది రోజులు ఓపిక పట్టండి అన్ని జరుగుతాయ్.. జరుగుతున్నాయి అంటూ ఈమె కామెంట్ చేశారు.

Anchor Anasuya: ఇంతమందిపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారబ్బా…
ఇక అనసూయను కొన్ని వేలమంది ఆంటీ అంటూ ట్రోల్ చేశారు..ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు మరి ఇంత మందిపై పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంపై ఎంతో మంది నెటిజెన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయని కాదు ఎంతో కీలకమైన నేతలు మంత్రులు ముఖ్యమంత్రులను కూడా ఇలా ట్రోల్ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు మరి అనసూయ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
































