Anchor Ravi: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి పెరిగిపోయింది. మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని సినీ సెలబ్రిటీల వరకు కూడా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున సిని సెలబ్రిటీలు టీవీ ఆర్టిస్టులు జబర్దస్త్ కమెడియన్లు కూడా చేరుకొని ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యాంకర్ రవి సైతం ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా రవి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆడాళ్లు మీకు జోహార్లు అనే కార్యక్రమం 600ఎపిసోడ్స్ పూర్తి కావడంతో ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే నాకు ఏ విధమైనటువంటి అవగాహన లేదని అవగాహన ఉన్నప్పుడే మాట్లాడటం మంచిదని తెలిపారు. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనమని నాకు తెలంగాణ నుంచి అలాగే ఆంధ్ర నుంచి భారీగా ఆఫర్ కూడా వచ్చిందని తెలిపారు.
ప్రజలు తెలివైన వారు..
నాకు రాజకీయాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే తాను వెళ్లడం లేదని తెలిపారు
అయినా ఎవరు ప్రచారం చేసిన ప్రజలు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో వాళ్ళకే వేస్తారని రవి తెలిపారు. ఇప్పుడు నాకు హీరో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కానీ నేను ఓటు మాత్రం మోడీకే వేస్తాను అలాగని అందరిని మోడీకే ఓటు వేయమంటే వాళ్లు వేస్తామని చెబుతారు కానీ వేసేటప్పుడు మాత్రం వారికి నచ్చిన వారికి ఓట్లు వేస్తారు అంటూ ఈ సందర్భంగా రవి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.





























