AP Cabinet: 164 సీట్లతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమై అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గెలిచిన వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే మొదటిసారి ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ఇక ఏపీ క్యాబినెట్ సమావేశంలో భాగంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. ఇక ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా డీఎస్సీకి ఆమోదం తెలిపారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ విషయంపై క్యాబినెట్లో చర్చలు కూడా జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జులై ఒకటి నుంచి ప్రారంభం కాబోతుందని డిసెంబర్ లోపు పోస్టులన్నింటిని భర్తీ చేయాలని క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది.
టెట్ నిర్వహణ..
ఇకపోతే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే చాలామంది టెట్ పరీక్షను కూడా రాశారు అయితే పరీక్ష ఫలితాలు ఇప్పటివరకు వెలబడలేదు ఈ క్రమంలోనే మరోసారి నిర్వహించాలని పలువురు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కోరగా ఆయన ఈ విషయంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా మరోసారి టెట్ నిర్వహిస్తే మరి కొంతమంది నిరుద్యోగులకు డీఎస్సీ రాసే అవకాశం కూడా కలుగుతుందని భావిస్తున్నారు.





























