Prabhas-Project K: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రభాస్, దీపిక జంటగా ఇటీవల హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తయింది.

దీంతో పాటు మరో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. మొత్తం రెండు షెడ్యూల్ లను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో అంటే మరో రెండు రోజుల్లో సినిమా షూటింగ్ ని పునఃప్రారంభించనున్నారు. పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్ను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత తెలిపాడు.

ఈ సినిమాకు ప్రాజెక్ట్ ‘కె’ అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో తెలిసిపోయింది.
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ..
వచ్చే ఏడాది (2023) వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రాజెక్ట్ కె నిర్మాత అశ్విన్ దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా.. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రాధే శ్యామ్’ ఈ నెల సంక్రాంతి రోజున విడుదల కావాల్సి ఉండగా. కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనున్న విషయం తెలిసిందే.

































