Connect with us

Featured

టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అనుష్క శెట్టి..!

Published

on

సినిమా ఇండస్ట్రీ అంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా మంది సినీ తారలు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలా క్యాస్టింగ్ కౌచ్ ద్వారా కమిట్మెంట్ ఇస్తేనే..వారికి ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయని ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు నిలదొక్కుకుంటారు అని చెబుతుంటారు.

తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒకవైపు గ్లామరస్ పాత్రలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో విశేష ఆదరణ పొందిన స్వీటీ సినిమా ప్రమోషన్ లో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. మీరు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారా.. అన్న ప్రశ్న ఆమెకు ఎదురవడంతో ఈ విషయం గురించి అనుష్క ఎంతో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న మాట వాస్తవమే అయినప్పటికీ నా వరకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. నా పనేదో నేను చూసుకుంటాను అందువల్ల నాతో మాట్లాడడానికి చాలామంది సాహసించేవారు కాదని తెలియజేశారు. అదేవిధంగా ఇండస్ట్రీలో తొందరగా గుర్తింపు పొందాలని అడ్డదారులను వెతుక్కుంటే ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలబడలేమని కష్టపడి సంపాదించిన గుర్తింపు వారికి ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు మనుగడ తీసుకువస్తుందని సూచించారు.

ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి ఏ విధమైనటువంటి సినిమాలు ప్రకటించకుండా దూరంగా ఉండడంతో ఈమె పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు పెద్దఎత్తున చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా అనుష్క చంద్రముఖి 2 లో నటించబోతున్నారని ఇందులో లారెన్స్ హీరోగా చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.

Advertisement

Featured

AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Published

on

AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.

ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.

ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.

Advertisement

పొత్తు ధర్మాన్ని పాటించండి..
ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: షర్మిల సునీతపై జగన్ ఘాటు వ్యాఖ్యలు.. హంతకులకే మద్దతంటూ?

Published

on

AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.

నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Advertisement

కూటమి అంటే కుట్రలు..
వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్‌ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Continue Reading

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!