Pitapuram: ఎన్నికల ఫలితాలు మరీ కొన్ని గంటలలో రాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర రాజకీయమంత ఒకవైపు అయితే పిఠాపురం రాజకీయం మాత్రం మరో వైపు అనే నడుస్తోంది. కూటమిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగారు అయితే ఈయనకు పోటీగా వైసీపీ నుంచి వంగా గీత పోటీకి దిగారు.

ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఒకటవ తేదీన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలలో భాగంగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని వెల్లడించారు. దాదాపు లక్ష మెజారిటీ రాబోతుందని కొన్ని సర్వేలు చెప్పగా మరికొన్ని సర్వేలు 70 వేల వరకు పవన్ మెజారిటీ సొంతం చేసుకుంటారని వెల్లడించాయి.
ఇలా పవన్ కళ్యాణ్ గెలుస్తారని విషయం వెల్లడించడంతో పలు ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారనే విషయం తెలియడంతో పిఠాపురంలో ఏ క్షణం అయినా ఎలాంటి అల్లర్లు అయినా జరగవచ్చని ఇంటలిజెన్స్ పేర్కొంది.
అల్లర్లు జరగవచ్చు..
ఇప్పటికే పిఠాపురంలో రాయలసీమలో ఓ జిల్లాకు చెందినటువంటి కొంతమంది మోహరించారని వారందరిని తక్షణమే అక్కడి నుంచి పంపించాలని కోరింది అంతేకాకుండా కౌంటింగ్ వద్ద పెద్ద ఎత్తున భద్రతను కూడా పెంపొందించాలని సూచించారు. ఎప్పుడైనా ఏ క్షణమైనా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని వైసిపి నేతలు పిఠాపురంలో టిడిపి జనసేన కార్యకర్తలపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పేర్కొనడమే కాకుండా మరింత భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది.





























