వైఎస్ జగన్ సర్కార్ కరోనా సంక్షోభ సమయంలోనూ.. సంక్షేమం పథకాలను కొనసాగిస్తోంది. మంగళవారం మరో కీలక పథకానికి నిధులను విడుదల చేయనుంది. చేనేతకు అసరగా నిలిచే ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకంలోని మూడవ విడత నిధులను విడుదల చేయనుంది. మూడో విడత ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 80,032 మంది నేతన్నలకు రూ. 192.08 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ప్రతి చేనేత కార్మికుడికి ఖాతాకు రూ. 24 వేలు అందించనున్నారు.
ఇక ఈ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 383.99 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం… మంగళవారం విడుదల చేసే రూ. 192.08 కోట్లతో కలిపి రూ.576.07 కోట్ల వరకు నేతన్నలకు అందించనున్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…