AP Politics: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమిచ్చి, ఆ ఇంటికి అందాల్సిన ప్రభుత్వ పథకాలన్నింటిని వాలంటీర్ సహాయం ద్వారా అందజేశారు. ఇలా ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని చెప్పాలి.

ఇలా వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనంగా 5000 రూపాయలు చెల్లించారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను అప్పట్లో ప్రతిపక్ష నేత ఆయన చంద్రబాబు నాయుడు పూర్తిగా తప్పు పట్టారు. వాలంటీర్ ఉద్యోగం అంటే గోన సంచలు మోసే ఉద్యోగం అని తెలిపారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారని కూడా వాలంటీర్ వ్యవస్థ పై మండిపడ్డారు.
ఇలా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీరా ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ల గురించి ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు తాజాగా శాసనమండలిలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Politics: వాలంటీర్ వ్యవస్థ లేదు..
గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని తద్వారా 2023 సెప్టెంబర్ నుంచి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలని ఈయన తెలిపారు. వైసీపీ వారు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. వైసిపి తమని నమ్ముకున్న ప్రజలు అలాగే కార్యకర్తలను పూర్తిగా మోసం చేసింది అంటూ బాల వీరాంజనేయులు చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి ఈయన మాటలను బట్టి చూస్తుంటే ఇక ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదని తెలుస్తోంది.




























