Ayyanna Pathrudu : టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు సోషల్ మీడియాలో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వాఖ్యలు చేసారు. ప్రస్తుత రాజకీయాల గురించి, జనసేనతో పొత్తుల గురించి ఆయన మాట్లాడారు. ఇక టీడీపీ లో కొంత మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటానికి కారణాలను ఆయన వివరించారు. ఇక ఆయన పై పెడుతున్న కేసులు, మిగిలిన టీడీపీ వాళ్లపైన పెడుతున్న కేసులు, వైసీపీ ఎమ్మెల్యే లు బూతులు మాట్లాడుతున్న తీరుపై వాఖ్యణించారు. విశాఖ రాజధాని అంశం, భూ ఆక్రమణ, కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావడం వంటి విషయాలపై స్పందించారు.
నేను ఈ వయసులో రేప్ చేయగలనా…..
టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు తనపై పెట్టిన నిర్భయ కేసు తదితర కేసులమీద, తన సహచరులపైనా పెట్టిన కేసులపైన మాట్లాడారు. కక్ష్య పూరిత రాజకీయాలు వైసీపీ చేస్తోందని కేసులతో భయపెట్టాలని చూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా అధికారిని నిలదీసినపుడు పనులు జరగలేదని ఒక సంఘటనలో నాపై నిర్భయ కేసు పెట్టారు. ఆవిడ చేస్తానని మాటిచ్చి వెళ్లిపోయారు. ఆవిడ వెళ్ళిపోయాక జనాలు ఆవిడ వెళ్ళిపోతోంది అంటే మాటిచ్చారు కదా.. అన్నాను అయితే ఒకవేళ చేయకపోతే అని జనాలు అంటే అపుడు ఒకవేళ చేయకపోతే వాళ్లే గుడ్డలుడదీస్తారని అన్నాను. అయితే అప్పటికి ఆవిడ అక్కడ లేరు. ఇక రెండు రోజుల తరువాత అధికార పార్టీ వాళ్ళు నాపై కేసును వాళ్లే డ్రాఫ్ట్ చేసి ఆమెతో సంతకం పెట్టించారు. నేను హై కోర్ట్ లో కేసు వేసానని ఎవరు క్షమాపణలు చెప్పాలో జడ్జిగారు తేలుస్తారంటు వాఖ్యణించారు.
Advertisement
జనసేనతో పొత్తు చర్చలు….
ఇక నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తు ఉండబోతుందనే అంశం మీద మాట్లాడుతూ జనసేనతో పొత్తు గురించి ఆలోచిస్తున్నామని ఇంకా అధికారికంగా చర్చలు జరగలేదని కింది స్థాయి నేతలు ఇరువైపులా పొత్తు ఉండాలని అనుకుంటున్నారని అయ్యన్న చెప్పారు. ఇక చాలా మంది టీడీపీ నేతలు జనసేన పార్టీ వైపుకి చూస్తున్నారని అడుగగా అలాంటిదేమి లేదు అయితే కొంతమంది పొత్తు ఉండొచ్చనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ నుండి గెలిచి మంత్రి పదవి కోసం అలా చేస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక విశాఖ లో జరుగుతున్న భూఆక్రమణ, విజయసాయి కనుసన్నల్లో జరుగుతోంది. ప్రభుత్వ భూములను, సాధారణ జనాల భూములను ఖబ్జా చేస్తున్నారని, రిషికొండను ఎందుకు చదును చేస్తున్నారని అడిగితే కలెక్టర్ దగ్గరే సమాధానం లేదని వాఖ్యణించారు.
Sundeep Kishan: సందీప్ కిషన్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ సరైన స్థాయిలో మాత్రం ఒక్క హిట్ కూడా పడలేదని చెప్పాలి. ఇలా సందీప్ కిషన్ తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్న ఈయనకు మాత్రం సక్సెస్ కలిసి రాలేదని చెప్పాలి.
ఇటీవల కెప్టెన్ మిల్లర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్ అనే సినిమాలో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ రాయన్ సినిమాలో తాను నటించిన పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని తెలిపారు. నిజానికి ఈ కథ ధనుష్ రాసుకున్నారు. ఒకరోజు ఆయన ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెబుతూ అది నా కోసం రాసుకున్న పాత్ర నువ్వు చేయాలి అని చెప్పారు.. ఆయన అలా చెప్పగానే ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేశాను.
Advertisement
ధనుష్ గారు తన కోసం రాసుకున్న పాత్ర నాకిచ్చారు అంటే అది నాకు దక్కిన గౌరవమే కదా. ఇక తాను సక్సెస్ అందుకోలేదని చాలామంది భావిస్తున్నారు. కానీ నాకు మాత్రం వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటే నేను నటించిన సినిమాలకు సక్సెస్ టాక్ రాకపోయినా కలెక్షన్లు బాగా వస్తున్నాయని అర్థం.నా పని నేను సరిగ్గా చేస్తే ప్రేక్షకులకు చేరువవుతాను అని నమ్ముతాను. గత 14 ఏళ్లుగా అదే చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Sri Anjaneyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా దూసుకుపోతున్నటువంటి వారిలో నటుడు నితిన్ ఒకరు. ఈయన జయం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే ఇటీవల కాలంలో నితిన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి నితిన్ కెరియర్లో నటించినటువంటి చిత్రాలలో శ్రీ ఆంజనేయం సినిమా ఒకటి. కృష్ణ వంశీ డైరెక్షన్లో నితిన్ ఛార్మి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలయ్యి సరిగ్గా నేటికీ 20 సంవత్సరాలు పూర్తి అయింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా చార్మి నటించిన కానీ ఫస్ట్ ఛాయిస్ ఛార్మి కాదని ఆర్తి అగర్వాల్ చెల్లెలు నటి ఆదితి అగర్వాల్ అని తెలుస్తుంది. ఈమె హీరోయిన్ గా రాఘవేంద్రరావు డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Advertisement
అదితి అగర్వాల్… ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె కెరియర్ ముగిసిపోయింది. ఇక శ్రీ ఆంజనేయం సినిమాలో ఫస్ట్ ఛాయిస్ అదితి అగర్వాల్ అయినప్పటికీ ఇందులో ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఈ సీన్లలో నటించే విషయంలో కృష్ణవంశీ అదితి అగర్వాల్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఈమె తప్పుకున్నారట. ఇక ఈమె తప్పుకోవడంతో ఈ సినిమాకు చార్మి కమిట్ అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ కాలేదు. అయితే చార్మి గ్లామర్ కు మంచి మార్కులే పడటంతో ఆమెకు తదుపరి అవకాశాలు కూడా వచ్చాయని చెప్పాలి.
Indra Movie: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఈయన హీరోగా ప్రేమ కథ చిత్రాలు కుటుంబ కథ చిత్రాలు అలాగే రాజకీయ నేపథ్యమున్న సినిమాలు కూడా చేశారు. ఇక యాక్షన్ సినిమాలలో కూడా చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలను తమ ఖాతాలో వేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్లో నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి. ఇలా ఈ బ్యానర్లో సూపర్ హిట్ అందుకున్న సినిమాలలో ఇంద్ర సినిమా ఒకటి. అప్పటివరకు యాక్షన్ సినిమాలు చిరంజీవికి సూట్ అవ్వవు అని అందరూ భావించారు కానీ డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన మొదటి యాక్షన్ సినిమా ఇంద్ర. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో అదే రోజు ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Advertisement
మూడు నంది అవార్డులు.. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ సిమ్రాన్ అనుకున్నారట కానీ ఆమె స్థానంలో ఆర్తి అగర్వాల్ నటించారు. అప్పట్లోనే ఈ సినిమా కోసం చిరంజీవి రెమ్యూనరేషన్ కాకుండా ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. 120 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని ఏకంగా 268 స్క్రీన్ లలో విడుదల చేశారు. ఏడుకోట్లతో పూర్తి అయిన ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమాకు మూడు విభాగాలలో నంది అవార్డులను కూడా అందుకోవటం విశేషం.