Connect with us

Featured

Ayyanna Pathrudu : ఈ వయసులో నేను రేప్ చేయగలనా, హింసించగలనా.. నాపై నిర్భయ కేసు పెట్టారు వైసీపీ వాళ్ళు…!

Published

on

Ayyanna Pathrudu : టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు సోషల్ మీడియాలో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వాఖ్యలు చేసారు. ప్రస్తుత రాజకీయాల గురించి, జనసేనతో పొత్తుల గురించి ఆయన మాట్లాడారు. ఇక టీడీపీ లో కొంత మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటానికి కారణాలను ఆయన వివరించారు. ఇక ఆయన పై పెడుతున్న కేసులు, మిగిలిన టీడీపీ వాళ్లపైన పెడుతున్న కేసులు, వైసీపీ ఎమ్మెల్యే లు బూతులు మాట్లాడుతున్న తీరుపై వాఖ్యణించారు. విశాఖ రాజధాని అంశం, భూ ఆక్రమణ, కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావడం వంటి విషయాలపై స్పందించారు.

నేను ఈ వయసులో రేప్ చేయగలనా…..

టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు తనపై పెట్టిన నిర్భయ కేసు తదితర కేసులమీద, తన సహచరులపైనా పెట్టిన కేసులపైన మాట్లాడారు. కక్ష్య పూరిత రాజకీయాలు వైసీపీ చేస్తోందని కేసులతో భయపెట్టాలని చూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా అధికారిని నిలదీసినపుడు పనులు జరగలేదని ఒక సంఘటనలో నాపై నిర్భయ కేసు పెట్టారు. ఆవిడ చేస్తానని మాటిచ్చి వెళ్లిపోయారు. ఆవిడ వెళ్ళిపోయాక జనాలు ఆవిడ వెళ్ళిపోతోంది అంటే మాటిచ్చారు కదా.. అన్నాను అయితే ఒకవేళ చేయకపోతే అని జనాలు అంటే అపుడు ఒకవేళ చేయకపోతే వాళ్లే గుడ్డలుడదీస్తారని అన్నాను. అయితే అప్పటికి ఆవిడ అక్కడ లేరు. ఇక రెండు రోజుల తరువాత అధికార పార్టీ వాళ్ళు నాపై కేసును వాళ్లే డ్రాఫ్ట్ చేసి ఆమెతో సంతకం పెట్టించారు. నేను హై కోర్ట్ లో కేసు వేసానని ఎవరు క్షమాపణలు చెప్పాలో జడ్జిగారు తేలుస్తారంటు వాఖ్యణించారు.

Advertisement

జనసేనతో పొత్తు చర్చలు….

ఇక నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తు ఉండబోతుందనే అంశం మీద మాట్లాడుతూ జనసేనతో పొత్తు గురించి ఆలోచిస్తున్నామని ఇంకా అధికారికంగా చర్చలు జరగలేదని కింది స్థాయి నేతలు ఇరువైపులా పొత్తు ఉండాలని అనుకుంటున్నారని అయ్యన్న చెప్పారు. ఇక చాలా మంది టీడీపీ నేతలు జనసేన పార్టీ వైపుకి చూస్తున్నారని అడుగగా అలాంటిదేమి లేదు అయితే కొంతమంది పొత్తు ఉండొచ్చనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ నుండి గెలిచి మంత్రి పదవి కోసం అలా చేస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక విశాఖ లో జరుగుతున్న భూఆక్రమణ, విజయసాయి కనుసన్నల్లో జరుగుతోంది. ప్రభుత్వ భూములను, సాధారణ జనాల భూములను ఖబ్జా చేస్తున్నారని, రిషికొండను ఎందుకు చదును చేస్తున్నారని అడిగితే కలెక్టర్ దగ్గరే సమాధానం లేదని వాఖ్యణించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!