బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నా.. ఇది నిజమేనా అంటూ ఎంతోమంది సందేహాలను వ్యక్తపరచారు. ఏ ఛానల్లో అని కొందరు ఆరా తీశారు. ఏ షోకి.. ‘బిగ్ బాసా’.. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోనా.. ‘నంబర్ 1 యారి’ షోకు హోస్ట్ చేయబోతున్నారా.. ఇలా నందమూరి అభిమానుల్లో ఒకటే ఆతృత. అయితే బాలయ్య హోస్ట్ అంటే అభిమానులు ఎంతగా ఎగ్జైట్ అయ్యారో.. కొందరు యాంటీ ఫ్యాన్స్ అంతగా నెగిటివ్ కామెంట్స్తో రెచ్చిపోయారు. ఎప్పుడైతే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన – మన తెలుగు ఓటీటీ ఆహా కోసం బాలయ్య హోస్ట్ చేయబోతున్నారని కన్ఫర్మ్ చేస్తూ ప్రకటించారో షాక్ తిన్నవారూ చాలామంది.
అయితే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ షో ప్రోమో వచ్చాక అందరూ ముక్కున వేలేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమాలో ఎంత ఎనర్జీగా కనిపించారో అంతకంటే రెట్టింపు ఎనర్జీతో అన్ స్టాపబుల్ షోలో బాలయ్య కనిపించి ఆశ్చర్యపరచారు. చెప్పాలంటే ఓ రకంగా బాలయ్య ఇప్పటి వరకు హోస్ట్ చేసిన వారిని చాలా వరకు డామినేట్ చేశారనే చెప్పుకున్నారు. ఈ షో చేసినందుకు బాలయ్య అందుకుంటున్న రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువే. అయినా బాలయ్యకు హోస్ట్గా కూడా చేసి తన స్టామినాని చూపించుకోవాలి.
పైగా ఇలాంటి షోలో ఎప్పుడూ బాలయ్య చేయలేదు కాబట్టి ఆయనకి ఓ సరదా కూడా తీరినట్టుటుంది. అదే బాలయ్య అన్ స్టాపబుల్ చేయడానికి కారణం అయింది. ఇక ఎంత సరదాగా తీసుకున్నా బాలయ్య ఎపిసోడ్ విషయంలో మాత్రం సినిమాకు కష్టపడినట్టే కష్టపడ్డారు. అంతక ముందు స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ అనే సెలబ్రిటీ షోకు హోస్ట్గా వ్యవహరించింది. కానీ, సమంత హోస్ట్గా ఫెయిల్ అయిందనే టాక్ వినిపించింది. ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు అతిథులుగా వచ్చారు. అయితే సమంత హోస్ట్ చేయడం సరిగా చేతకాక షో ఫ్లాపయింది.
దాంతో సమంత సామ్ జామ్ ను మధ్యలోనే ఆపేశారు. కానీ బాలయ్య మాత్రం హోస్ట్గా సూపర్ సక్సెస్ అయ్యారు. ముందు అనుకున్న ఎపిసోడ్స్ కంటే ఇప్పుడు ఎపిసోడ్స్ పెరుగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్ డైరెక్టర్స్, హీరోలు ఇందులో గెస్టులుగా వచ్చి బాలయ్యతో సందడి చేస్తున్నారు. ఈ షో ద్వారా అల్లు అరవింద్కు మంచి లాభాలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అందుకే ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ కంటిన్యూ అవుతోంది. నాని హోస్ట్గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2 అంతగా సక్సెస్ కాలేదు. నానికి మైనస్ మార్కులే పడ్డాయి.
ఇక తాజాగా కంప్లీట్ అయిన బిగ్ బాస్ సీజన్ 5కి కూడా నాగార్జున కొంతవరకు మైనస్ అనే టాక్ వినిపించింది. బిగ్ బాస్ సీజన్ 1 కు హోస్ట్గా వ్యవహరించిన జూనియర్ ఎన్.టి.ఆర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కంప్లీట్ అయిన ఎవరు మీలో కోటీశ్వరుడు కూడా తారక్ బాగా సక్సెస్ చేశాడు. నంబర్ 1 యారీతో రానా కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఒక్కసారి హోస్ట్గా చేసిన చిరు మళ్ళీ కనిపించలేదు. ఇక మంచు మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మీ చేసిన షోలు బాగానే సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోకు మాత్రం బాలయ్య బాగా సూటయ్యారని అందరూ చెప్పుకుంటున్నారు. ఇకపై కూడా బాలయ్య పలు క్రేజీ షోస్కు హోస్ట్గా చేసే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.