ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోజురోజుకు ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో వైయస్సార్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలుచేశారని ఆరోపిస్తూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు శాసనసభ నుంచి వాకౌట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సభ నుంచి వెళ్లిపోయిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు.
మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు తనకు సభలో అవమానం జరిగిందని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఎంతో అవమానించారని మీడియా ఎదుట చంద్రబాబునాయుడు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై నందమూరి కుటుంబం మీడియా ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ శాసనసభలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత దూషణలు గురించి మాట్లాడటం సబబు కాదని వివరించారు. వైయస్సార్ ప్రభుత్వం వ్యక్తిగత అజెండాగా పెట్టుకొని ఇలా దూషించడం సరికాదని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలకు ప్రజలు నోటితో కాకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజాసమస్యలు పలు అంశాలపై పోరాటం చేయాలని దివంగత నేత ఎన్టీరామారావు చెప్పారని ఆయన మాటలను గుర్తు చేసుకున్నారు. అసలు చంద్రబాబు గురించి అలా విమర్శించడంతో మనం అసెంబ్లీలో ఉన్నామా లేకపోతే ఏదైనా గొడ్ల చావడిలో ఉన్నామా అంటూ ఈ సందర్భంగా మీడియా ఎదుట బాలకృష్ణ వైసిపి నేతలపై ఫైర్ అయ్యారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…