ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోజురోజుకు ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో వైయస్సార్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలుచేశారని ఆరోపిస్తూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు శాసనసభ నుంచి వాకౌట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సభ నుంచి వెళ్లిపోయిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు.

మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు తనకు సభలో అవమానం జరిగిందని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఎంతో అవమానించారని మీడియా ఎదుట చంద్రబాబునాయుడు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై నందమూరి కుటుంబం మీడియా ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ శాసనసభలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత దూషణలు గురించి మాట్లాడటం సబబు కాదని వివరించారు. వైయస్సార్ ప్రభుత్వం వ్యక్తిగత అజెండాగా పెట్టుకొని ఇలా దూషించడం సరికాదని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలకు ప్రజలు నోటితో కాకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజాసమస్యలు పలు అంశాలపై పోరాటం చేయాలని దివంగత నేత ఎన్టీరామారావు చెప్పారని ఆయన మాటలను గుర్తు చేసుకున్నారు. అసలు చంద్రబాబు గురించి అలా విమర్శించడంతో మనం అసెంబ్లీలో ఉన్నామా లేకపోతే ఏదైనా గొడ్ల చావడిలో ఉన్నామా అంటూ ఈ సందర్భంగా మీడియా ఎదుట బాలకృష్ణ వైసిపి నేతలపై ఫైర్ అయ్యారు.































