Connect with us

Featured

Balayya -Vijayasai Reddy: అలేఖ్య కుటుంబానికి అండగా నిలిచిన బాలయ్య విజయ్ సాయి రెడ్డి… నిజంగా గొప్పోళ్ళు?

Published

on

Balayya -Vijayasai Reddy: తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబ సభ్యులను అభిమానులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సినిమా ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.అతి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి విధి ఆడుతున్న వింత నాటకంలో తలవంచక తప్పలేదు. ఈ విధంగా తారకరత్న మరణించడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక నందమూరి తారకరత్న పాదయాత్రలో భాగంగా స్పృహ తప్పి పడిపోవడంతో ఆ క్షణం నుంచి తన వెంటే ఉంటూ ఆయన బ్రతికి రావాలని అహర్నిశలు పోరాడుతూ నిత్యం డాక్టర్లను తన ఆరోగ్యం పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటూ తనని బ్రతికించడం కోసం ఎంతో కష్టపడ్డారు నందమూరి బాలకృష్ణ. తారకరత్నకు బాలకృష్ణ వరుసకు బాబాయ్ అయినప్పటికీ తనకు తండ్రి సమానులు.పెళ్లి కారణంగా తారకరత్న కుటుంబానికి దూరం కావడంతో బాలకృష్ణ నందమూరి కుటుంబంతో తారకరత్నను కలిపారు. ఈ కారణంతోనే తారకరత్న బాలకృష్ణ మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.

ఇక తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి మరెవరో కాదు వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కుమార్తె. ఇలా అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు.ఆ తారకరత్న అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారని తెలియగానే పార్టీ విభేదాలను పక్కనపెట్టి తారకరత్న కోసం విజయసాయిరెడ్డి కూడా ఎంతో కష్టపడ్డారు. నిత్యం డాక్టర్లకు టచ్ లో ఉంటూ ఈయన ఎప్పటికప్పుడు తారకరత్న పరిస్థితి ఆరా తీసారు.

Advertisement

Balayya -Vijayasai Reddy: అలేఖ్యకు అండగా బాలయ్య… విజయ్ సాయి రెడ్డి

ఈ విధంగా తారకరత్న బ్రతికించుకోవడం కోసం ఒకవైపు తారకరత్న బాబాయ్ బాలకృష్ణ రెడ్డి పెదనాన్న విజయసాయిరెడ్డి ఎంతో కష్టపడినప్పటికీ చివరికి కఠినమైన బాధాకరమైన విషయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.ఇక తారకరత్న మరణించారని వార్త తెలియగానే హుటాహుటిన విజయసాయిరెడ్డి తన నివాసానికి చేరుకొని అక్కడ అన్ని తానే చూసుకున్నారు. పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వారందరినీ స్వయంగా ఆహ్వానించారు. ఇలా తారకరత్న మరణించడంతో అలేఖ్య తన పిల్లల బాగోగులను వీరిద్దరూ చూసుకోబోతున్నట్లు తెలియజేశారు.ఇలా కష్ట సమయంలో వారి మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి అలేఖ్య కుటుంబానికి మద్దతుగా నిలబడటంతో నిజంగా బాలకృష్ణ విజయసాయిరెడ్డి ఇద్దరు ఎంతో గొప్ప మంచి మనసు ఉన్న వాళ్ళని అభిమానులు వీరి వ్యవహార శైలిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Featured

Venu Swamy: ఆవిడ నన్ను ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది: వేణు స్వామి రియల్

Published

on

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచారు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలిసి రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలోని డైలాగుకు రీల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరొకరి వీడియో ద్వారా ఈయన అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సోనాలి బింద్రే ఇద్దరు ప్యారిస్ వెళ్లగా అక్కడ బ్రహ్మానందంతో ఓ సన్నివేశం వస్తుంది. మీ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంటూ నాగార్జున బ్రహ్మానందం ని అడగడంతో అందుకు ఆయన చెబుతూ మొదట ఆమె నన్ను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే డైలాగును వేణు స్వామి కూడా రీ క్రియేట్ చేశారు.

Advertisement

ఊపిరి పీల్చుకో..

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా సోషల్ మీడియా ఇక ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా జ్యోతిష్యం చెబుతూనే వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

https://www.instagram.com/reel/C5oDUlhxisr/?utm_source=ig_embed&ig_rid=c69f6a00-74ea-461b-b532-7e7a5316f48a

Advertisement

Continue Reading

Featured

Rashmika: నాకంటే అందగత్తెలు ఉన్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్టార్ డం గురించి ఈమె మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నాకంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు అలాగే బాగా నటించగలిగే వారు ఉన్నారు వారందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇలా నేను ఇక్కడ వాళ్లు అక్కడ ఉండటానికి కారణం అదృష్టం మాత్రమేనని ఈమె తెలిపారు. నాకు అదృష్టం రావడంతో ఇక్కడికి వచ్చానని ఈమె తెలియజేశారు. ఇలా వచ్చిన అదృష్టాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేశానని రష్మిక తెలిపారు.

Advertisement

పతనానికి కారణం..
సినిమా ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు ఏ రంగంలో అయినా కూడా జయాలు అపజయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి అయితే మనం విజయం సాధించినప్పుడు ఆ పొగరు తలకెక్కించుకోకూడదు అలా ఎక్కించుకున్నాము అంటే ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని అది పతనానికి కారణం అవుతుంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ఇది వారందరికీ దక్కిన గౌరవం అంటూ?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!