Bandla Ganesh : ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ సినిమా షూటింగుల బంద్. నిర్మాణ వ్యయం పెరిగి నిర్మాత నష్టపోతున్నాడని నిర్మాతల గిల్డ్ సినిమాల షూటింగులను బంద్ చేసారు. ఇక దీనీపై రకరకాలుగా స్పందిస్తున్నారు సినిమా పెద్దలు. కొంతమంది సరైన నిర్ణయం అంటుంటే మరికొంతమంది మాత్రం సినిమా షూటింగులను ఆపడమెంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హీరోల రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ తగ్గుతుందని నిర్మాతల గిల్డ్ అభిప్రాయపడటం హీరోలు తగ్గించుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ విషయం పైన అశ్విని దత్ స్పందించాడు.

సినిమాలతో సంబంధం లేనివాళ్లు గిల్డ్ లో ఉన్నారు…
నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ హీరోలను రెమ్యూనరేషన్ తగ్గించుకోమనండం ఏంటని ప్రశ్నించారు. సినిమా టికెట్ రేట్లు పెంచమని అడిగిన వారే ఈరోజు రేట్లు తగ్గించమని అడుగుతున్నారు అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఈ మాటల్తో తాను ఏకిభవిస్తున్నాను అంటూ నిర్మాత,నటుడు బండ్ల గణేష్ మాట్లాడారు. ఏ హీరోను, డైరెక్టర్ ను పారితోషికం తగ్గించకోమని అడిగే హక్కు నిర్మాతకు లేదని వాఖ్యనించాడు. మార్కెట్లో ఒక్కో కారుకి ఒక్కో రేట్ ఉంటుంది. అన్ని కార్లే అయిన రేట్లు వేరుగా ఉంటాయి. మనం స్థోమతను బట్టి కార్లను కొంటాము. అలాగే హీరోల మార్కెట్ ను బట్టి హీరోలకు రేటు ఉంటుంది.

నువ్వెవ్వరు హీరోలను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పడానికి, ఆ హీరో తో సినిమా చేస్తున్నావ్ అంటే ఆయనకు ఉన్న మార్కెట్ ను కవర్ చేసి లాభలను తెచ్చుకోగలవనే నమ్మకంతోనే సినిమా చేయాలి. అంతే కానీ రేటు తగ్గించుకోమనడానికి నువ్వెవరు. అసలు నిర్మాతల గిల్డ్ ఏమిటి అవసరం ఏముంది, ఒక అసోసియేషన్ లేక ఛాంబర్ ఏర్పాటు చేయొచ్చు కదా ఇదేందుకు. ఇక ఆ గిల్డ్ లో సినిమా గురించి ఏ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు మెంబెర్స్ గా ఉన్నారు. సినిమాకు ఏ లైట్లు వాడుతారో కూడా తెలియని ప్రొడ్యూసర్లు ఉన్నారు. నేను నటుడుగా, ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రొడ్యూసర్ గా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీ నన్ను ఎప్పుడు నిరుత్సాహ పరచలేదు అంటూ హాట్ కామెంట్స్ చేసారు.
































