Barelakka: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే మే 13వ తేదీ తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో మరోసారి రాజకీయ వేడుక రాజుకుంది.

ఇకపోతే ఈ ఎన్నికలలో భాగంగా మరోసారి బర్రెలక్క ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు వెల్లడిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఈమె అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే. నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తూ ఎన్నికల బరిలో దిగిన బర్రెలక్క కేవలం 5000 ఓట్లు మాత్రమే సాధించారు.
ఈ విధంగా గత ఎన్నికలలో ఓటమి పాలు అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా ఈసారి కూడా లోక్ సభ ఎన్నికలకు ఈమె పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తన భర్త వెంకటేష్ తో కలిసి ఈమె నామినేషన్ వేశారు.నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది శిరీష.
ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క..
ఎలాంటి హడావుడి, లేకుండా.. కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గతంలో బర్రెలక్కకు ఆర్ఎస్పీ గట్టిగా మద్దతు తెలిపారు.





























