Barrelakka: బర్రెలక్క అలియాస్ శిరీష పరిచయం అవసరం లేని పేరు ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను షేర్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. అంతేకాకుండా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి శిరీష భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఎన్నికలలో పరాజయం అయినప్పటికీ ఈమె తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేస్తానని చెప్పుకు వచ్చారు. ఇకపోతే తాజాగా ఈమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీ వెంకటేష్ అనే వ్యక్తితో ఏడడుగులు నడిచినటువంటి శిరీష తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
సోషల్ మీడియా వేదికగా ఈమె చేసిన ఈ ఎమోషనల్ పోస్టు చూసి ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. పెళ్లయిన వారానికి ఈమె ఇలాంటి పోస్ట్ చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు మరి లెక్క చేసిన ఆ పోస్ట్ ఏంటి అనే విషయాన్ని వస్తే..ఒక అమ్మాయికి గాయం అయితే.. గాయం చేసిన వాళ్లను ఏమీ అనరు.. అదే గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు.
అమ్మాయి ధైర్యంగా బయటకు రాలేదు..
ఒక అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు.. మంచోళ్లు ఉన్నారు, చెడ్డోళ్లు ఉన్నారు. ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలనే ఆలోచన రాదు. ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్లు బయట బాగానే ఉన్నారు.. ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు అంటూ సమాజంలో అమ్మాయిల పరిస్థితిని తెలియజేస్తూ ఈమె సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.



























