కోల్కతాలో చెలరేగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్తో సహా 200 మంది బిజెపి మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర కోల్కతాలోని సిమ్లా స్ట్రీట్లోని స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి ముందు బీజేపీ నేతలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారింది. దీంతో అరెస్టు చేసిన వారందరినీ కోల్కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ లాకప్కు తీసుకువెళ్లారు.
