Connect with us

Featured

ఆ రోజు నుంచే బిగ్ బాస్ తెలుగు 5 ప్రోగ్రాం స్టార్ట్..! కంటెస్టెంట్ లిస్ట్ రెడీ చేసిన నిర్వాహకులు..!

తెలుగు రియాల్టీ షో లల్లో ఎక్కువగా పాలపులర్ తెచ్చుకున్న తెలుగు ప్రోగ్రాం బిగ్ బాస్. గత నాలుగు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా వీక్షకులల

Published

on

తెలుగు రియాల్టీ షో లల్లో ఎక్కువగా పాలపులర్ తెచ్చుకున్న తెలుగు ప్రోగ్రాం బిగ్ బాస్. గత నాలుగు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా వీక్షకులలో కుతూహలాన్ని పెంచుతూ పోయాయి. ఇప్పుడు ఐదవ సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో గత సీజన్స్ టీఆర్పీని క్రాస్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈసారి కాస్త గ్లామర్ డోస్‌ను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఐదో సీజన్ కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. NTR తో మొదలై, నాని చేతుల మీదుగా నాగార్జున భుజస్కందాలపైకి బిగ్ బాస్ షో చేరింది.

చివరి మూడు, నాలుగు సీజన్స్ ను కింగ్ నాగార్జునే సమర్థవంతంగా నడిపారు. ఇప్పుడీ ఐదో సీజన్ కు రానా పేరు తొలుత వినపడినా, తాను ‘బిగ్ బాస్’ షో చేయడంలేదని ఆయనే ఖండించడంతో ఆ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది. అయితే ముచ్చటగా మూడోసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ షో ను నిర్వహిస్తారనే అనిపిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సివుంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. నాలుగో సీజన్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనే విషయాలు ముందుగానే తెలిసేవి.

ఈ సారి మాత్రం అలాంటి లీకులకు అవకాశం లేకుండా ముందస్తు జగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించిన మరో బిగ్ అప్ డేట్ ఏమిటంటే… ఈ సీజన్ సెప్టెంబర్ 5 నుండి మొదలువుతుందని తెలుస్తోంది. టెలికాస్ట్ కు దాదాపు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ పనులూ శరవేగంగా సాగుతున్నాయట. ఇదిలా ఉండగా.. ఐదో సీజన్ కోసం అప్పుడే నిర్వహకులు కంటెస్టెంట్ లిస్ట్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ లిస్ట్ లో యాంకర్‌ రవి, యాంకర్‌ వర్షిణి, బుల్లితెర నటి నవ్యస్వామి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇక మంగ్లీ బిగ్‌బాస్‌ సెట్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదట.. బోనాల సందర్బంగా ఆమె పాడినపాట వివాదాలకు తావివ్వడంతో బిగ్‌బాస్‌ వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందట.. అయితే నిర్వాహకులు మాత్రం ఆమెను ఎలాగైనా ఒప్పించి, షోకి తీసుకురావాలని షో భావిస్తున్నారు.

Advertisement

Featured

Siddharth -Aditi: రహస్యంగా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన అదితి సిద్ధార్థ్?

Published

on

Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో
సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..

ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

తెలంగాణలో వివాహం..
రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pallavi Prashanth: ఖైదీలందరూ అలా మాట్లాడేవారు.. జైలు జీవితం పై పల్లవి ప్రశాంత్ కామెంట్స్!

Published

on

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ రైతుబిడ్డగా పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఎన్నో రకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ అనంతరం విన్నర్ గా బయటకు వచ్చారు.

ఇక గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున కార్లు ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడంతో ఈయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయితే బెయిలు మీద బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన రెండు రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను రెండు రోజులపాటు జైలులో చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. బాధతో భోజనం కూడా చేయలేదని కానీ తోటి ఖైదీలు చెప్పడంతో భోజనం చేశానని జైలు కూడు బాగుందని తెలిపారు. నన్ను వీఐపీ ఇలా ట్రీట్ చేసిన లేక సాధారణంగా ట్రీట్ చేసిన కూడా అక్కడ భోజనం బాగుందని ఈయన వెల్లడించారు. ఇక ఖైదీలు అందరూ కూడా నాతో మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి ప్రశ్నలు వేసే వాళ్ళు విన్నర్ ఎవరంటూ కూడా అడిగేవారు.

Advertisement

బిగ్ బాస్ గురించి అడిగేవారు..
ఇక నేను వెళ్ళిన తర్వాత జైలుకు వచ్చిన వారు బయట జరిగిన గొడవ గురించి తెలిపే వారని ప్రశాంత్ తెలిపారు. అయితే నేను జైలులో ఉంటే ఏ మాత్రం భయపడలేదు నేను తప్పు చేయలేదు అందుకే ఎవరికి భయపడలేదని కానీ నాపై విమర్శించిన వారికి కూడా అదే గతే పడుతుంది అంటూ ఈ సందర్భంగా జైలు జీవితం గురించి ప్రశాంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!