Nataraj Master: ప్రస్తుతం ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం నటరాజ్ మాస్టర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఇక అందరూ ఊహించిన విధంగానే ఈ వారం హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.

ఈయన ఎలిమినేట్ కాగానే ఎంతోమంది ఈయనతో ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా నట్రాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ బిగ్ బాస్ విన్నర్ తానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో నిజాయితీగా ఆడాను. కానీ నాకు ఎవరు ఓట్లు వేయలేదు. బయటకి వచ్చి చూడగా సోషల్ మీడియాలో అందరూ తప్పుడు ఓట్లు వేసుకుని ఇంకా హౌస్ లో కొనసాగుతున్నారు.
దొంగ ఓట్లతో ఆడుతున్నారు…
ఇలా నిజాయితీగా ఆడిన తను హౌస్ నుంచి బయటకు వచ్చానని, దొంగ ఓట్లతో ఆడేవారు ఇంకా హౌస్ లోనే కొనసాగుతున్నారంటూ నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్ చేశారు. ఇలా దొంగ ఓట్లతో హౌస్ లో కొనసాగే వారు నిజమైన విన్నర్స్ కాదు. నిజాయితీగా ఆడిన తానే బిగ్ బాస్ విన్నర్ అంటూ నటరాజ్ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






























