మహమ్మారి కరోనా ప్రపంచం మొత్తాన్ని దిక్కు తోచని స్థితిలోకి నెట్టివేసింది. అన్ని దేశాలు కరోనా కట్టడి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కూడా ఇంకా ఈ వ్యాధిని అదుపు చేయలేకపోతున్నాయి. ధనిక దేశాలు సైతం కరోనా భారిన పడి అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు కరోనా వాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేశాయి. అయితే ఇపుడు బ్రిటన్ ని మరో కొత్త సమస్య భయపెడుతుంది. ఆ దేశంలో చిన్నారులు మూడు రోజులుగా విపరీతమైన కడుపు మంట, గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. ఈ సమస్యలతో వందలాది మంది బాధితులు హాస్పిటల్ లో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇవే వ్యాధి లక్షణాలు కరోనా భదితులలో కూడా ఉండడం అక్కడ అందరినీ కలవరపెడుతున్న విషయం .

చిన్నారుల్లో టాక్సిక్ షాక్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని అని అక్కడి వ్యాధులు వెల్లడించారు. పిల్లలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే హాస్పిటల్ లో చేర్పించాలి అని అధికారులు తెలియ చేస్తున్నారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారిని గుర్తించి ఐసీయులో వైద్యం చేయాలని ప్రభుత్వ ఆరోగ్య విభాగానికి ఉత్తర్వులు జారీ చేసింది బ్రిటన్ ప్రభుత్వం. బ్రిటన్ లో ఉపటి వరకు 1,69,568 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 24 వేల మంది కరోనా కారణంగా మరణించారు.

































