Byreddy Rajashekhar Reddy : రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిగా గుర్తింపు ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాయలసీమ హక్కులను కాపాడండి అంటూ ఉపన్యాసలు ఇస్తున్నారు. రాయలసీమకు చెందిన సీఎం రాయలసీమ అభివృద్ధిని గాలికి వదిలేసాడంటూ విమర్శించారు. రాజధాని అమరావతిలో లేకపోతే కర్నూల్ లో ఉండాలి కానీ వైజాగ్ కి ఎలా తరలిస్తారు అంటూ ఫైర్ అయ్యారు.

వాళ్ళలా ప్రత్యేక రాష్ట్రం అడగలేదు… మా హక్కు అడుగుతున్నాం…
రాష్ట్ర విభజన తరువాత రాజదని అంశంలో పెద్ధ చర్చ జరిగింది. ఇక అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉందని భావించి అక్కడే పెట్టారు. ఇక ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ మొదలు పెట్టి ఇప్పుడు రాజధానిని విశాఖకు తరలితున్నట్లు చెప్పడంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని కానట్లయితే రాజధాని రాయలసీమలో ఉండాలంటూ అది మా హక్కంటూ చెప్పారు.

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. న్యాయ రాజధాని కర్నూల్ కి ఇస్తామని చెప్పి ఇప్పుడు మంగళగిరిలో జ్యూడిషల్ అకాడమీని ఏర్పాటు చేయడంతోనే కర్నూల్ కి మొండి చేయి చూపారని అర్థమవుతుంది అంటూ చెప్పిన ఆయన ధర్మాన ప్రసాద్ వంటి వారు వైజాగ్ ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ అనడం గురించి మాట్లాడుతూ అంత ఆశలు మాకేమీ లేవు, మేము అడుగుతున్నది రాజధాని మాత్రమే అంటూ చెప్పారు.


































