టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించారంటూ ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేసారు పటమట పోలీసులు.

ఏపీ లో ప్రస్తుతం కరోనా ఉదృతి దృశ్యా కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే అయితే టిడీపీ సేనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తూ ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారనే ఆరోపణలపై ఆయన పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.. ఐసీసీ సెక్షన్ 188, 269, 270 రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు ఎపిడమిక్ చట్టం కింద నరేంద్రపై కేసులు నమోదు చేశారు పోలీసులు.


































