‘ప్రపంచవ్యాప్తంగా దంత వైద్యులు సిఫార్సు చేస్తున్న, ప్రపంచపు నంబర్ వన్ సెన్సిటివిటి టూత్పేస్ట్’ అంటూ టీవీలతో పాటూ అనేక సామాజిక మాధ్యామాలలో సెన్సోడైన్ టూత్ పేస్ట్ సంబంధించన ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే.. అయితే తాజగా ఆ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ).

విదేశీ వైద్యులతో తీసిన ప్రకటలు టెలివిజన్ తో పాటుగా సోషల్ మీడియా లో వస్తున్న ప్రకటనలను సుమోటోగా స్వీకరించిన సీసీపీఏ.. సెన్సోడైన్ టూత్పేస్ట్ ఇస్తున్న ప్రకటనలు వినియోగదారులను వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, ఈ ప్రకటనలను వారం రోజుల్లోగా తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు దీనిపై సెన్సోడైన్ కు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. అయితే సెన్సోడైన్ బ్రాండ్ మాతృ సంస్థ అయిన జీఎస్కే కన్జ్యూమర్ హెల్త్కేర్ ఈ ఆదేశాలపై స్పందిస్తూ వినియోగదారుల సంక్షేమానికి తమ సంస్థ పెద్దపీట వేస్తుందని. ఈ క్రమంలో ఉత్పత్తుల నాణ్యతలో తామూ ఎప్పుడూ రాజీపడబోమని చెబుతుంది..
































